Chennai: తల్లి క్యాన్సర్ చికిత్స కోసం దాచిన డబ్బులతో రమ్మీ ఆడిన కొడుకు.. చివరికీ..
- ఆన్లైన్ గేమ్ వ్యసనంగా మారిన యువకుడు
- తల్లి క్యాన్సర్ చికిత్స కోసం దాచిన నగదుతో రమ్మీ
- మందలించడంతో సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలో ఆన్లైన్ గేమ్ వ్యసనానికి సంబంధించిన కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల యువకుడు తన తల్లి క్యాన్సర్ చికిత్స కోసం వచ్చిన డబ్బుతో ఆన్లైన్లో రమ్మీ ఆడాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని తీవ్రంగా మందలించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు టెర్రస్పై ఉన్న టీవీ కేబుల్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
READ MORE: Parliament ‘assault’ case: రాహుల్ గాంధీ పార్లమెంట్ ‘‘దాడి’’ కేసుపై స్పెషల్ టీం ఏర్పాటు..!
Also Read
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
- AP Government Jobs: గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
చెన్నైలోని చిన్నమలైలోని రెండవ వీధిలో నివసించే ఆకాష్ చిన్న పనులు చేసేవాడు. అతని తండ్రి ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడు. సోదరుడు, తల్లి తో కలిసి ఉంటున్నాడు. కోవిడ్ సమయంలో ఆకాష్ కు ఆన్లైన్ రమ్మీ అలవాటైంది. అతని వ్యసనం పెరుగుతూ వచ్చింది. కొద్దిరోజుల క్రితం తన తల్లికి చికిత్స నిమిత్తం ఇంట్లో ఉంచిన రూ.30 వేలుతో ఆన్ లైన్ రమ్మీ ఆడాడు. ఇంట్లో ఉంచిన డబ్బులు కనిపించకపోవడంతో తల్లి, సోదరుడు విచారించారు. విషయం తెలియడంతో తీవ్రంగా మందలించారు. దీంతో ఆకాష్కి కోపం వచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
READ MORE: Tamil Nadu: దేవుడి హుండీలో పడిన ఐఫోన్.. వ్యక్తికి షాకిచ్చిన ఆలయ నిర్వాహకులు…
శుక్రవారం రాత్రి ఆకాష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో కంగారు పడ్డారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు రాత్రంతా వెతికారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కుటుంబ సభ్యులు డాబాపై చూసే సరికి ఆకాష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కొట్టుపురం పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!