Chennai: తల్లి క్యాన్సర్ చికిత్స కోసం దాచిన డబ్బులతో రమ్మీ ఆడిన కొడుకు.. చివరికీ..
- ఆన్లైన్ గేమ్ వ్యసనంగా మారిన యువకుడు
- తల్లి క్యాన్సర్ చికిత్స కోసం దాచిన నగదుతో రమ్మీ
- మందలించడంతో సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలో ఆన్లైన్ గేమ్ వ్యసనానికి సంబంధించిన కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల యువకుడు తన తల్లి క్యాన్సర్ చికిత్స కోసం వచ్చిన డబ్బుతో ఆన్లైన్లో రమ్మీ ఆడాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని తీవ్రంగా మందలించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు టెర్రస్పై ఉన్న టీవీ కేబుల్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
READ MORE: Parliament ‘assault’ case: రాహుల్ గాంధీ పార్లమెంట్ ‘‘దాడి’’ కేసుపై స్పెషల్ టీం ఏర్పాటు..!
Also Read
చెన్నైలోని చిన్నమలైలోని రెండవ వీధిలో నివసించే ఆకాష్ చిన్న పనులు చేసేవాడు. అతని తండ్రి ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడు. సోదరుడు, తల్లి తో కలిసి ఉంటున్నాడు. కోవిడ్ సమయంలో ఆకాష్ కు ఆన్లైన్ రమ్మీ అలవాటైంది. అతని వ్యసనం పెరుగుతూ వచ్చింది. కొద్దిరోజుల క్రితం తన తల్లికి చికిత్స నిమిత్తం ఇంట్లో ఉంచిన రూ.30 వేలుతో ఆన్ లైన్ రమ్మీ ఆడాడు. ఇంట్లో ఉంచిన డబ్బులు కనిపించకపోవడంతో తల్లి, సోదరుడు విచారించారు. విషయం తెలియడంతో తీవ్రంగా మందలించారు. దీంతో ఆకాష్కి కోపం వచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
READ MORE: Tamil Nadu: దేవుడి హుండీలో పడిన ఐఫోన్.. వ్యక్తికి షాకిచ్చిన ఆలయ నిర్వాహకులు…
శుక్రవారం రాత్రి ఆకాష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో కంగారు పడ్డారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు రాత్రంతా వెతికారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కుటుంబ సభ్యులు డాబాపై చూసే సరికి ఆకాష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కొట్టుపురం పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Haji Ali Ship: హోర్ముజ్ జలసంధిలో ఘోరం.. భారత నౌకను ముంచేసిన డ్రోన్ దాడి!
-
Phool Gobi Yakhni Recipe : ఘుమఘుమలాడే కాశ్మీరీ వంటకం.. పూల్ గోబీ యఖ్నీ తయారీ విధానం..!
-
Storm Hit UP: ఒక్క రోజే 100 మంది మృతి.. యూపీలో తుఫాను బీభత్సం..
-
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?