సాధారణంగా విలువైన వస్తువులు ఏమిటని అడిగితే.. వజ్రాలు, బంగారం, వెండి అని గుర్తొస్తుంది. ప్రపంచంలో వాటి కన్నా విలువైనవి చాలా ఉన్నాయి. తేలు, పాములు కూడా విలువైనవే అంటే మీరు నమ్ముతారా..? కాని ఇప్పుడు ఖచ్చితంగా నమ్మాల్సిందే.. ప్రపంచంలో ఖరీదైన వాటిల్లో తేలు విషం కూడా ఒకటి. అదేంటి తేలు విషం మనుషులకు హానీ చేస్తుంది కదా.. అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. తేలు కుట్టినా, పాము కుట్టినా చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇవి కుట్టాయి అంటే చాలు మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక పాములు తేళ్ల కు సంబంధించిన విషం మనిషి శరీరం లోకి వెళ్తే మనిషి బతకడం చాలా కష్టం. కాని ఆ విషంతో చాలా లాభాలు ఉన్నాయి. దాంతో ఏం చేస్తారో తెలుసుకుందామా.. వీటి విషంతో మనిషికి ఉపయోగపడే ఔషధాలను తయారు చేస్తున్నారు. తేలు విషం కోట్లలోనే పలుకుతుందట. లీటరు తేలు విషం 80 కోట్ల రూపాయలు పలుకుతుందట. ఇది ఎంత చెప్పినా నమ్మాలి అనిపించేలా లేదు కదా..!
READ MORE: Sukumar’s Proteges: కుమారి 21ఎఫ్ టు ప్రసన్నవదనం.. వావ్ అనిపించిన సుకుమార్ శిష్యుల సినిమాలివే
కాని ఇది నిజం. అందరూ సాధారణంగా కోళ్లు, పందులు, మేకల తదితరాలను పెంచుతుంటారు. కాని తేలు విషం ఖరీదు గురించి తెలిసుకున్న టర్కీకి చెందిన మెటీన్ ఒరిన్లెర్ అనే వ్యక్తి తేళ్ల కు ఓ ఫామ్హౌస్ ఏర్పాటు చేశారు. అందులో వాటిని పెంచుతున్నారు. వేల సంఖ్యలో తేళ్లను పెంచుతూ.. వాటి విషాన్ని సేకరిస్తున్నాడు. ఆ తర్వాత ఆ విషాన్ని గడ్డకట్టేలా చేసి తరువాత పొడిగా మార్చి విక్రయిస్తున్నాడు. ఇలా తీసిన తేలు విషాన్ని యాంటీబయోటిక్స్, కాస్మోటిక్స్, పెయిన్ కిల్లర్ ల తయారీలో ఉపయోగిస్తారట. అయితే 300 నుంచి 400 తేళ్ల నుంచి ఒక గ్రాము విషాన్నిసేకరిస్తున్నారు. అందుకే కొందరు స్నేక్ క్యాచర్స్ పాములను ఇతరులు చంపకుండా కాపాడుతుంటారు. వాటిని పట్టుకుని అడవుల్లో వదిలేస్తుంటారు. వారికి పాముల విషంతో ఓషధాలు తయారు చేస్తారన్న విషయం తెలుసు కాబట్టే అలా చేస్తుంటారు.