Palnadu: పల్నాడులో భారీ స్కాం.. బ్యాంక్ నుంచి బంగారం మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడులో భారీ స్కాం బయటపడింది. ఇంటి దొంగల చేతి వాటంతో దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో భారీగా బంగారం మాయమైంది. డబ్బు చెల్లించిన తర్వాత బంగారం ఇవ్వమంటే ఖాతాదారులకు బ్యాంక్ అధికారులు మొండి చేయి చూపిస్తున్నారు. బ్యాంక్ అప్రైజర్ నాగార్జున, మేనేజర్ మధుబాబు కలిసి తమ బంగారం మాయం చేశారని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల డబ్బులు కట్టి, ఖాతాలు రెన్యువల్ చేసిన అనేక ఖాతాల్లో సిబ్బంది బంగారం మాయం చేసినట్లు ఖాతాదారులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని అకౌంట్లలో ఖాతాదారులకు తెలియకుండా అధిక మొత్తంలో లోన్లు తీసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. బ్యాంక్ సిబ్బంది మొత్తాన్ని విచారించాలని.. బ్యాంకు ముందు వందల సంఖ్యలో ఖాతాదారులు ఆందోళనకు దిగారు.
Disney+ Hotstar: హాట్స్టార్కు గుడ్బై చెబుతున్న సబ్స్క్రైబర్లు .. 1.25 కోట్ల మంది గుడ్బై
Also Read
మరోవైపు బంగారం మాయమైన వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దోడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో.. డొడ్లేరుతో పాటు సమీపంలో ఉన్న ఐదు గ్రామాల ప్రజలకు ఆ బ్యాంక్ లో ఖాతాలు ఉన్నాయి. అయితే ఖాతాదారులు గత కొద్ది నెలలుగా బ్యాంకు అప్పు చెల్లించినప్పటికీ.. బ్యాంకు సిబ్బంది రసీదులు ఇవ్వలేదని చెబుతున్నారు. అంతేకాకుండా ఖాతాదారులకు తెలియకుండా ఖాతాల్లో పెద్ద మొత్తం లోన్ల రూపంలో డబ్బులు డ్రా చేశారని అంటున్నారు. దీంతో తమ ఖాతాల పేరుతో పెద్ద ఎత్తున లోన్లు ఉండటంతో బాధితులు లబోదిబోమని అంటున్నారు. అంతేకాకుండా మరికొన్ని అకౌంట్ లలో ఉన్న బంగారం నకిలీదని అనుమానిస్తున్నారు. ప్రతి 10 గ్రాములకు 5 గ్రాములు మాయమైనట్లు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో బాధితులు ఆందోళనకు దిగారు. మరోవైపు బ్యాంకు ప్రధాన ద్వారం మూసేసి బ్యాంకు ఉన్నతాధికారులు లోపల తనిఖీలు చేస్తున్నారు. బ్యాంకులో ఇంత వ్యవహారం జరుగుతున్న మేనేజర్ కు తెలియకుండా జరుగుతుందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- bank
- dodleru
- Gold
- Missing
- telugu news
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!