పల్నాడులో భారీ స్కాం బయటపడింది. ఇంటి దొంగల చేతి వాటంతో దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో భారీగా బంగారం మాయమైంది. డబ్బు చెల్లించిన తర్వాత బంగారం ఇవ్వమంటే ఖాతాదారులకు బ్యాంక్ అధికారులు మొండి చేయి చూపిస్తున్నారు. బ్యాంక్ అప్రైజర్ నాగార్జున, మేనేజర్ మధుబాబు కలిసి తమ బంగారం మాయం చేశారని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.