AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
- పూర్తిగా స్వదేశీ AK-203 రైఫిల్ను తయారు చేసిన భారత్..
- ‘షేర్’ పేరుతో రూపొందించిన రైఫిల్ ఫైరింగ్ ట్రయల్స్ విజయవంతం.
- రైఫిల్లోని ప్రతి విడిభాగం, ముడి పదార్థం భారత్లోనే తయారీ.
- AK-203లో సుమారు 50 ప్రధాన, 180 ఉప భాగాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AK-203: విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా, భారత్ పూర్తిగా స్వదేశంలోనే, స్వదేశీ ముడి పదార్థాలతోనే తయారైన AK-203 రైఫిల్ను ఆవిష్కరించింది. దీనికి ‘షేర్’ అని పేరు పెట్టారు. ఈ రైఫిల్ ఆటోమేటిక్, బరస్ట్ ఫైరింగ్ టెస్టుల్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. 2019లో భారత్, రష్యా మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా AK-203 రైఫిళ్లను భారత్లోనే తయారు చేసేందుకు ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) ఏర్పాటైంది. భారత్లో తయారైన రైఫిళ్లలో మొదటగా దిగుమతి చేసుకున్న కిట్లను ఉపయోగించగా, ఇప్పుడు దేశీయ భాగాల వాటాను పెంచారు.
తాజాగా తయారైన షేర్లో ప్రతీ విడిభాగం, ముడి పదార్థం భారత్లోనే తయారైంది. కేవలం రైఫిల్ను భారత్లో అసెంబుల్ చేయడమే కాకుండా, దాని తయారీకి అవసరమైన ప్రతీ వస్తువును భారత్లోనే దేశీయంగా అభివృద్ధి చేశారు. AK-203లో సుమారు 50 ప్రధాన భాగాలు, 180 ఉప భాగాలు, దాదాపు 120 తయారీ ప్రక్రియలు ఉన్నాయి. వీటన్నింటినీ భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసేందుకు IRRPL అనేక దేశీయ సరఫరాదారులను అభివృద్ధి చేసింది.
Also Read
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
AK-203 7.62×39 మిమీ కార్ట్రిడ్జ్ను ఉపయోగించే గ్యాస్-ఆపరేటెడ్, మ్యాగజైన్-ఫెడ్ అసాల్ట్ రైఫిల్. ఫోల్డింగ్, అడ్జస్టబుల్ స్టాక్, ఎర్గోనామిక్ గ్రిప్, ఆధునిక ఆప్టికల్ పరికరాలను అమర్చేందుకు రైల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం భారత సైన్యం ఉపయోగిస్తున్న ఇన్సాస్ రైఫిల్కు దీనిని ప్రత్యామ్నాయంగా తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అమేథీలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ రైఫిళ్లను తయారు చేస్తున్నారు. మొత్తం 6,01,427 AK-203 రైఫిళ్లను తయారు చేసే కాంట్రాక్ట్ ఉంది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.5,200 కోట్లు. ఉత్పత్తి గడువును కూడా అక్టోబర్ 2032 నుంచి డిసెంబర్ 2030కు ముందుకు తీసుకొచ్చారు. ఈ లెక్కన కోర్వా ప్లాంట్ ప్రతీ రోజు 600 రైఫిళ్లను తయారు చేయాల్సి ఉంటుంది. ప్రతీ 100 సెకన్లకు ఒక రైఫిల్ తయారు కావాలి. ఈ రైఫిళ్లలో వాడుతున్న దేశీయ వస్తువులు 2025 మధ్య నాటికి 50 శాతం ఉండగా, ఇది ఇప్పుడు 100 శాతానికి చేరుకుంది. ఈ రైఫిళ్లపై భారత సైన్యం యూజర్ ట్రయల్స్ నిర్వహించనుంది. సెప్టెంబర్ 2026 నాటికి ఈ రైఫిళ్లను భారత సైన్యానికి అందచేసి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!