Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
- బంగ్లాదేశ్లోని హిందూ కుటుంబానికి చెందిన నలుగురి హత్య..
- ఇంటి పైకప్పుపై డ్రగ్స్ తీసుకుంటుండగా చూశారని హత్యలు..
- హత్యల తర్వాత నిందితులు 6–7 గంటలు ఇంట్లోనే ..
- ఇంట్లో ఖర్జూరాలు, దోసకాయలు తిన్న ఆనవాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో హిందూ కుటుంబంలోని నలుగురు దారుణహత్యకు గురయ్యారు. రంగ్పూర్లోని వారి ఇంట్లో శవాలుగా కనిపించారు. ఈ కేసులో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి పైకప్పుపై ఇద్దరు వ్యక్తులు యాబా అనే మెథాంఫెటమైన్ డ్రగ్ను తీసుకుంటుండగా కుటుంబంలోని ఒక వ్యక్తి చూడటంతో, ఈ గుట్టు ఎక్కడ బయటపడుతుందనే భయంతో కుటుంబం మొత్తాన్ని చంపేసినట్లు తేలింది. బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం.. హత్యల తర్వాత నిందితులు వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా దాదాపు 6-7 గంటల పాటు ఇంట్లోనే ఖర్జూరా, దోసకాయలు తిని, స్నానం చేసి వెళ్లినట్లు తెలిసింది.
ఈ కేసులో మగ్ధో, సిద్ధార్థ అనే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు రిటైర్డ్ రంగ్పూర్ జిల్లా స్కూల్ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత చక్రవర్తి (50), కుమార్తె ఆగామి చక్రవర్తి ప్రార్థి (23), 12 ఏళ్ల కుమారుడు ప్రియమ్ చక్రవర్తిలను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుటుంబానికి ఎవరితో గొడవలు, శత్రుత్వం లేదని తేలింది. రంగ్పూర్ మెట్రోపాలిటన్ పోలీసులు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, డిటెక్టివ్ బ్రాంచ్ కలిసి దర్యాప్తు చేసి అనుమానితులను పట్టుకున్నారు.
Also Read
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Trump: ఇరాన్పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
రంగ్పూర్ పోలీస్ కమిషనర్ మహమ్మద్ అబ్దుల్ మాబుద్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఇద్దరు అనుమానితులు పక్కింటి భవనం పై నుంచి గణపతి ఇంటి పైకప్పు పైకి వచ్చారు. శబ్ధం వస్తుందని పైకి వెళ్లిన గణపతి, ఇద్దరు నిందితుల్ని ప్రశ్నించాడు. దీంతో తాము డ్రగ్స్ తీసుకున్న విషయం బయటకు వస్తుందని గొంతు నులిమి హత్య చేశారు. గొడవ శబ్ధాలు విన్న గణపతి భార్య ప్రీతిలత కూడా ఇలాగే చంపేశారు. దీని తర్వాత కుమార్తె ఆగామి, కుమారుడి ప్రియమ్ను కూడా హత్య చేశారు. ప్రియమ్కు నిందితుల్లో ఒకరితో పరిచయం ఉందని అనుమానిస్తున్నారు. ప్రియమ్, సిద్ధార్థ తమ్ముడు అపూర్వకు స్నేహితుడని, తమ గుర్తింపును బయటపెడతాడనే భయంతో అతడిని చంపి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!