Couple Died: అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి.. బలవన్మరణమా.. విభేదాలు కారణమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. బలవన్మరణానికి పాల్పడారా.. లేక విభేదాల కారణంగా భార్యను హతమార్చి భర్త ఉరేసుకున్నాడా అన్నది తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతానికి చెందిన చక్రవర్తుల శ్రీధర్(28)కు అదే జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగికి చెందిన దేవి(24)తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి బాబు (7) పాప(6). ఈ కుటుంబం మూడేళ్ల కిందట రాజమండ్రి వచ్చి ఆనందనగర్ లో ఉంటోంది. శ్రీధర్ తాపిమేస్త్రీ. రెండేళ్లకు దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో దేవి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రుల వద్దే కొంతకాలంగా ఉంటోంది.
Turbulence: ఖతార్ ఎయిర్వేస్ విమానంలో కుదుపులు.. 12 మందికి గాయాలు..
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
వారం కిందట శ్రీధర్ అత్తారింటికి వెళ్లి వారితో మాట్లాడి పిల్లలను అక్కడే ఉంచి, భార్యను తీసుకుని రాజమండ్రి వచ్చాడు. స్థానిక బంధువు ఒకరు శ్రీధర్ ఇంటి వచ్చి అతడ్ని పిలిచేసరికి ఎటువంటి స్పందన లేదు. కిటికిల్లోంచి చూసేసరికి శ్రీధర్ ఫ్యానుకు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలించారు. దేవి మెడకు చున్నీ బిగిసిపోయి గదిలో పడి మృతి చెంది ఉంది. శ్రీధర్ సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ మృతి చెంది ఉన్నాడు. ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడి ఉంటే ఒకరు నేలపై, మరొకరు ఫ్యానుకు వేలాడుతూ ఎలా ఉంటారనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి రాజమండ్రి మూడో పట్టణ సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ దర్యాప్తు చేస్తున్నారు.
Heatwave: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు
ఉదయం రాజమండ్రి వచ్చిన శ్రీధర్ భార్యను ఇంట్లో దించి గంట తరువాత ఓ మద్యం సీసా తీసుకుని తిరిగి ఇంట్లోకి వెళ్లినట్లుగా స్థానికులు పోలీసులుకు వివరించారు. మద్యం మత్తులో శ్రీధర్ ఈ ఘాతుకం తలపెట్టాడా.. కావాలనే ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారా అన్నది తేలాల్సి ఉంది. అమ్మానాన్న మృతితో ఇద్దరు చిన్నారులు ఒంటరయ్యారు. తల్లిదండ్రులు మృతదేహాలు వద్ద చిన్నారులు కంట తడపెట్టడం చూసి స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు.
తాజావార్తలు
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!