Heatwave: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. జనం ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. ముఖ్యంగా ఉదయం పదిగంటలు దాటిన తర్వాత భానుడి భగభగలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడుగా.. తీవ్రమైన వడగాల్పులు కూడా వీస్తాయని తెలిపింది. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రేపు (సోమవారం) 72 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎల్లుండి (మంగళవారం) 165 మండలాల్లో తీవ్రవడగాల్పులు,149 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
NAMO : సర్వైవల్ కామెడీ మూవీగా వస్తున్న ‘నమో’.. రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (72)
శ్రీకాకుళం 3, విజయనగరం17, పార్వతీపురంమన్యం 10, అల్లూరి 2, అనకాపల్లి 2, కాకినాడ 6, కోనసీమ 2, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 3, ఏలూరు 7, కృష్ణా 2, బాపట్ల కొల్లూరు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (200)
శ్రీకాకుళం 12, విజయనగరం 7, పార్వతీపురంమన్యం 5, అల్లూరిసీతారామరాజు 8, విశాఖ 1, అనకాపల్లి 14, కాకినాడ 14, కోనసీమ11, తూర్పుగోదావరి 2, పశ్చిమగోదావరి 13, ఏలూరు 21, కృష్ణా 19, ఎన్టీఆర్ 17, గుంటూరు 17, పల్నాడు 12, బాపట్ల 19, ప్రకాశం 8 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత, పల్నాడు జిల్లా నరసరావుపేలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత, ప్రకాశం జిల్లా కనిగిరిలో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత, తిరుపతి జిల్లా నాయుడుపేటలో డిగ్రీల ఉష్ణోగ్రత, కాకినాడ జిల్లా తుని, కృష్ణా జిల్లా కంకిపాడులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత, నెల్లూరు జిల్లా మనుబోలులో డిగ్రీల ఉష్ణోగ్రత, ఏలూరు జిల్లా పెదవేగిలో 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ క్రమంలో.. మరోవైపు తీవ్రమైన వడగాల్పుల నేపథ్యంలో ప్రజలంతా వీలైనంత వరకూ ఇళ్లల్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగింటి వరకూ ఇళ్లల్లోనే ఉండాలని సూచించింది. వయో వృద్ధులు, పిల్లలు, బాలింతలు, గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని.. వీలైనంత ఎక్కువగా మంచినీళ్లు తాగాలని సూచించింది. వదులైన వస్త్రాలు ధరించాలని.. నల్లటి దుస్తులకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తలపై టోపీ లేదా గొడుగు తీసుకెళ్లాలని చెప్తున్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!