Terrorist Incidents: రెండు నెలల్లో 9 ఉగ్రవాద ఘటనలు.. ఈ ఏడాది 22 మంది మృతి
- ఈ ఏడాది జమ్మూ డివిజన్లో పెరిగిన ఉగ్రవాద కేసులు
- జూన్-జూలై నెలల్లోనే ఎనిమిది ఉగ్రవాద ఘటనలు
- జనవరి 1 నుండి ఇప్పటివరకు ఉగ్రవాదుల దాడుల్లో..
- ఆర్మీ కెప్టెన్తో సహా 12 మంది భద్రతా సిబ్బంది బలి
- ఈ దాడుల్లో 10 మంది పౌరులు మరణించగా.. 55 మందికి గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది జమ్మూ డివిజన్లో ఉగ్రవాద కేసులు పెరిగాయి. అయితే.. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మూడంచెల భద్రతా గ్రిడ్ను రూపొందిస్తామని అధికారులు చెప్పారు. జూన్-జూలై నెలల్లోనే ఎనిమిది ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజున మొదలైన ఉగ్రదాడుల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భద్రతకు సంబంధించి ఎన్నో అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగినా.. కొందరు ఉగ్రవాదులు మాత్రం దాడులు ఆపడం లేదు. జమ్మూ డివిజన్లో జరిగిన దాడుల గురించి మాట్లాడుతూ.. జనవరి 1 నుండి ఇప్పటివరకు ఉగ్రవాదుల దాడుల్లో ఆర్మీ కెప్టెన్తో సహా 12 మంది భద్రతా సిబ్బంది బలి అయ్యారు. ఈ దాడుల్లో 10 మంది పౌరులు మరణించగా, 55 మంది గాయపడ్డారు. ఈ సమయంలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Read Also: Justice Narasimha Reddy: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కమిషన్ ఛైర్మన్గా వైదొలిగా..
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
ఈ ఏడాది జరిగిన తీవ్రవాద ఘటనలు:
జూలై 15: దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక అధికారి సహా నలుగురు ఆర్మీ సిబ్బంది వీరమరణం పొందారు.
జూలై 8: కతువా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొంది, చాలా మంది గాయపడ్డారు.
జులై 7: రాజౌరీ జిల్లాలో భద్రతా స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో సైనిక సిబ్బందికి గాయాలు అయ్యాయి.
జూన్ 26: దోడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు.
జూన్ 12: దోడా జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో ఒక పోలీసు గాయపడ్డాడు.
జూన్ 11/12: కథువా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడ ఓ సీఆర్పీఎఫ్ జవాను బలి అయ్యాడు. అదే రోజు దోడా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది, ఒక ప్రత్యేక పోలీసు అధికారి గాయపడ్డారు.
జూన్ 9: రియాసి జిల్లాలో బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది యాత్రికులు మరణించారు మరియు 42 మంది గాయపడ్డారు.
4 మే 2024: పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో భారత వైమానిక దళానికి చెందిన ఒక సైనికుడు వీరమరణం పొందాడు మరియు ఐదుగురు గాయపడ్డారు.
ఏప్రిల్ 28: ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో గ్రామ రక్షణ గార్డు వీరమరణం పొందాడు.
ఏప్రిల్ 22: రాజౌరీ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఉగ్రవాదులు కాల్చిచంపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!