Kamareddy: వరదలో చిక్కుకున్న 9 మంది.. నిన్న ఉదయం 10 గంటల నుంచి చెరువు మధ్యలోనే..
- వరదలో చిక్కుకున్న 9 మంది
- నిన్న ఉదయం 10 గంటల నుంచి చెరువు మధ్యలోనే
- వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ గ్రామానికి చేరుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డిలో వర్షం బీభత్సం సృష్టించింది. ఆకాశానికి చిల్లుపడినట్లుగా కుండపోత వర్షం కురిసింది. దీంతో భారీ వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. కాగా బిబిపేట్ మండలం యాడారం చెరువులో తొమ్మిది మంది చిక్కుకున్నారు. పొలం పనుల నిమిత్తం వ్యవసాయ బావులకు వద్దకు వెళ్లారు గ్రామస్తులు.
Also Read:Astrology: ఆగస్టు 28, గురువారం దినఫలాలు
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
నిన్న ఉదయం 10 గంటల నుంచి చెరువు మధ్యలోనే చిక్కుకుపోయారు. ఒక్కసారిగా వరద పెరగడంతో చెరువు మధ్యలో చిక్కుకున్న తొమ్మిది మంది గ్రామస్తులు. తమను కాపాడాలని అధికారుకు సమాచారం అందించారు. దీంతో వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ గ్రామానికి చేరుకుంది. చెరువులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవలను సిద్ధం చేసుకుని చెరువులోకి బయలుదేరింది రెస్క్యూ టీం. సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Also Read:CM Chandrababu: ఏపీకి ఎలాంటి ఇబ్బందులు రాకూడని వినాయకుడిని కోరుకున్నా!
కామారెడ్డి లో వర్షం మళ్ళీ మొదలైంది. తెల్లవారు జాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కామారెడ్డి -హైదరాబాద్ రూట్ లో మెల్లి మెల్లిగా కదులుతున్న వాహనాలు.. కామారెడ్డి – సికింద్రాబాద్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం.. పలు రైళ్లు రద్దయ్యాయి.. జుక్కల్ ఎల్లారెడ్డి కామారెడ్డిలో వేలాది ఎకరాల్లో నీట మునిగిన వరి మొక్క జొన్న పత్తి పంటలు.. లింగం పేట, నాగిరెడ్డి పేట, మాచారెడ్డి, సదా శివ నగర్, గాంధారి లో కోతకు గురైన రోడ్లు.. జలదిగ్బంధంలో కామారెడ్డి పట్టణం లోని జీ.అర్. కాలనీ, అశోక్ నగర్, పంచముఖి హనుమాన్, కాకతీయ కాలనీ లు గోసంగి, ఇందిరా నగర్ కాలనీ లు.. లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు 150 పునరావాస కేంద్రాలకు భాదితుల తరలింపు.. సత్యా గార్డెన్, ఉర్దూ భవన్ లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?