CM Chandrababu: ఏపీకి ఎలాంటి ఇబ్బందులు రాకూడని వినాయకుడిని కోరుకున్నా!
- బెజవాడలో మహాగణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
- సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన నిర్వాహకులు
- ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిన సీఎం
CM Chandrababu Visits 72 ft Ganesh idol in Vijayawada: బెజవాడలో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాగణపతి మట్టి విగ్రహంను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. భవిత్యత్తులో ఏపీకి ఏ ఇబ్బందులు రాకుండా తొలగిపోవాలని వినాయకుడిని కోరుకున్నానని తెలిపారు. ఏపీ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కార్యసిద్ధి గణపతిని ప్రార్ధించాను అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
‘చిన్నప్పటి నుంచి నేను కూడా గణేష్ మహోత్సవాలు నిర్వహించేవాడిని. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే.. విఘ్నాలు తొలగించి వాటిని ఇచ్చే శక్తి ఉన్న దైవం వినాయకుడు. దేశమంతా వాడవాడలా జరిగే పండుగ గణేష్ చతుర్ధి. వినాయక చవితి చేయాలంటే ఇప్పటి వరకు మైక్, కరెంట్కు పర్మిషన్లు పెట్టుకోవాలని నిబంధన ఉండేది. ఈసారి పర్మిషన్లు లేకుండా మండపాలకు విద్యుత్ సరఫరా ఉచితముగా ఇచ్చాం. గణేష్ ఉత్సవాలు జరగాలంటే గతంలో అన్నీ విఘ్నాలు ఎదురయ్యేవి. మా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వటానికి రూ.30 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెబితే.. పర్లేదు ఇవ్వండి అని చెప్పాను. గణేశ్ ఉత్సవాలలో అపశృతి లేకుండా చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది. 72 అడుగుల మట్టి గణపతిని ఇక్కడే నిమజ్జనం చేయటం విశేషం’ అని సీఎం చెప్పారు.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
Also Read: 1 Ball 22 Runs: అత్యంత ఖరీదైన డెలివరీ.. ఒక్క బంతికి 22 రన్స్! వీడియో వైరల్
‘రానున్న రోజుల్లో ప్రకృతి అంతా కలుషితం అయ్యే పరిస్థితులు వచ్చాయి. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛంద్ర కార్యక్రమం తెచ్చాము. గత ఏడాది వరదలు వస్తే సమర్ధవంతంగా ఎదుర్కొని పునరావాసం కల్పించాము. బుడమేరు వరద రాకుండా అన్ని చర్యలు చేపట్టాం.1500 టీఎంసీలు గోదావరి ద్వారా సముద్రంలో కలిసాయి. రాష్ట్రంలో కరువు లేకుండా పండుగ జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశారు. దేశంలో ఎక్కడ జరగని అభివృద్ధి ఏపీలో జరుగుతోంది. 2047నాటికి ఏపీ స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధ్యం అయ్యేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!