CM Chandrababu: ఏపీకి ఎలాంటి ఇబ్బందులు రాకూడని వినాయకుడిని కోరుకున్నా!
- బెజవాడలో మహాగణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
- సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన నిర్వాహకులు
- ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Visits 72 ft Ganesh idol in Vijayawada: బెజవాడలో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాగణపతి మట్టి విగ్రహంను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. భవిత్యత్తులో ఏపీకి ఏ ఇబ్బందులు రాకుండా తొలగిపోవాలని వినాయకుడిని కోరుకున్నానని తెలిపారు. ఏపీ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కార్యసిద్ధి గణపతిని ప్రార్ధించాను అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
‘చిన్నప్పటి నుంచి నేను కూడా గణేష్ మహోత్సవాలు నిర్వహించేవాడిని. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే.. విఘ్నాలు తొలగించి వాటిని ఇచ్చే శక్తి ఉన్న దైవం వినాయకుడు. దేశమంతా వాడవాడలా జరిగే పండుగ గణేష్ చతుర్ధి. వినాయక చవితి చేయాలంటే ఇప్పటి వరకు మైక్, కరెంట్కు పర్మిషన్లు పెట్టుకోవాలని నిబంధన ఉండేది. ఈసారి పర్మిషన్లు లేకుండా మండపాలకు విద్యుత్ సరఫరా ఉచితముగా ఇచ్చాం. గణేష్ ఉత్సవాలు జరగాలంటే గతంలో అన్నీ విఘ్నాలు ఎదురయ్యేవి. మా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వటానికి రూ.30 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెబితే.. పర్లేదు ఇవ్వండి అని చెప్పాను. గణేశ్ ఉత్సవాలలో అపశృతి లేకుండా చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది. 72 అడుగుల మట్టి గణపతిని ఇక్కడే నిమజ్జనం చేయటం విశేషం’ అని సీఎం చెప్పారు.
Also Read
Also Read: 1 Ball 22 Runs: అత్యంత ఖరీదైన డెలివరీ.. ఒక్క బంతికి 22 రన్స్! వీడియో వైరల్
‘రానున్న రోజుల్లో ప్రకృతి అంతా కలుషితం అయ్యే పరిస్థితులు వచ్చాయి. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛంద్ర కార్యక్రమం తెచ్చాము. గత ఏడాది వరదలు వస్తే సమర్ధవంతంగా ఎదుర్కొని పునరావాసం కల్పించాము. బుడమేరు వరద రాకుండా అన్ని చర్యలు చేపట్టాం.1500 టీఎంసీలు గోదావరి ద్వారా సముద్రంలో కలిసాయి. రాష్ట్రంలో కరువు లేకుండా పండుగ జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశారు. దేశంలో ఎక్కడ జరగని అభివృద్ధి ఏపీలో జరుగుతోంది. 2047నాటికి ఏపీ స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధ్యం అయ్యేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!