Uttarakhand: మితిమీరిన వేగం.. గాల్లో ప్రాణాలు.. బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగం, అజాగ్రత్త డ్రైవింగ్ కారణంగా బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరకాశీ జిల్లాలోని గంగ్నాని సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదంలో గుజరాత్కు చెందిన ఏడుగురు యాత్రికులు మరణించగా, 28 మంది గాయపడినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
Read Also: Uttar Pradesh: ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలు.. కర్రలతో కొట్టి చంపిన జనాలు
Also Read
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగోత్రి హైవేపై ఆదివారం నాటి ప్రమాదానికి ప్రధాన కారణం, అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ కారణమని తెలిపారు. ఈ ఘటనపై డ్రైవర్ ముఖేష్ కుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఉత్తరకాశీ) పేర్కొన్నారు. బస్సు లోయలో పడిపోతున్న సమయంలో బస్సు వేగం అతిగా ఉందని గాయపడిన ప్రయాణికులు చెప్పారని పోలీసులు చెప్పారు.
Read Also: Manchu Manoj: మళ్లీ మా అమ్మ దగ్గరకే.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్
మితిమీరిన వేగం కారణంగా వాహనాన్ని అదుపులోకి తెచ్చేందుకు డ్రైవర్కు సమయం లేకపోవడం, ఏమీ తోచకపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ చెబుతున్నారు. ప్రమాదంపై జిల్లా మేజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారని, పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు కూడా గాయాలయ్యాయని.. అతడు కోలుకున్నాక అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసు సూపరింటెండెంట్ పేర్కొన్నారు. 35 మందితో బస్సు గంగోత్రి నుంచి తిరిగి వస్తుండగా బస్సులోయలో పడినట్లు పోలీసులు చెబుతున్నారు.
- Tags
- bus
- died
- national news
- people
- valley
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!