Earthquake: అర్ధరాత్రి నేపాల్, ఢిల్లీని వణికించిన భూకంపం.. ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: నేపాల్లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 6 మంది చనిపోయారు. నేపాల్లో భూకంపం సంభవించడంతో భారత రాజధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. మంగళవారం అర్థరాత్రి దాటాక 1.57 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 6.3తీవ్రతగా నమోదైంది. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడా, గుడ్గావ్ ప్రాంతాల్లో పది సెకన్ల పాటు ప్రకంపనలు రాగా.. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి చేరుకున్నారు.
Salary Hike కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్న మోదీ సర్కార్..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
బుధవారం ఉదయం నేపాల్లో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని, ఆరుగురు వ్యక్తులు మరణించినట్లు ఆ దేశ భూకంప కేంద్రం తెలిపింది. నేపాల్లోని దోటీ జిల్లాలో భూకంపం కారణంగా ఇల్లు కూలిపోవడంతో ఆరుగురు వ్యక్తులు చనిపోయారని తెలిసింది. ఈ భూకంపం భారతదేశంలోని పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్కు ఈశాన్యంగా 158 కిమీ (98 మైళ్ళు) కేంద్రీకృతమై ఉంది. 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సీస్మాలజీ సెంటర్ ప్రకటించింది. నేపాల్లో 24 గంటల్లో రెండు సార్లు భూమి కంపించింది. అంతకుముందు మంగళవారం రాత్రి 8.52 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపం తర్వాత మీడియా నివేదికలు భారతదేశ రాజధాని న్యూఢిల్లీ, పరిసర ప్రాంతాలలో కూడా ప్రకంపనలు సంభవించాయని చూపించాయి. భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ఇంతకుముందు భూకంప తీవ్రత 5.6గా ఉందని అంచనా వేసింది. భూప్రకంపనలు చోటుచేసుకున్న అర్ధగంటలోపే ఈ అంశం ట్విటర్ ట్రెండింగ్లోకి రావడం గమనార్హం. దాదాపు 20వేల ట్వీట్లు చేశారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!