Road Accident: కారు – ట్రక్కు ఢీ.. నలుగురు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం..
- ఉత్తరప్రదేశ్ లోని ఇటావాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.
- నలుగురు మృతి..
- ముగ్గురి పరిస్థితి విషమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: ఉత్తరప్రదేశ్ లోని ఇటావాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు ఒకే కుటుంబానికి చెందినవారు. వీరంతా ఎర్టిగా కారులో ప్రయాణం చేస్తున్నారు. వారు ప్రయాణించే కారు దారిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. లారీని ఢీకొట్టడంతో పేద్దగా కేకలు వినిపించాయి. కారు వచ్చిన వేగానికి ఒక్కసారిగా చెల్లచెదురుగా మారింది. కారు భాగాలను కోసి మృతదేహాలను బయటకు తీశారు అధికారులు.
G. Kishan Reddy: వ్యక్తులు, కుటుంబం కోసం కాదు.. దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఎటావాలోని ఇక్డిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 19పై ఉదయం 7 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఇక్కడ ఆగ్రా కాన్పూర్ హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఎర్టిగా ఢీకొట్టింది. ఢీకొనడంతో కారులో ఉన్న ఏడుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో తీవ్ర గాయాలపాలైన మహిళ, బాలికను జిల్లా ఆస్పత్రి నుంచి సైఫాయి మెడికల్ కాలేజీకి తరలించారు. మాట్లాడగలిగే జితేంద్ర అనే పిల్లాడు మేం తన తల్లి ఇంటికి వెళ్తున్నామని చెప్పాడు. మా చెల్లి, మా అమ్మ గాయపడ్డారు. మేమంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లం. సగం కుటుంబం చనిపోయిందని తెలిపాడు. ఈ ప్రమాదం చాలా భయంకరంగా ఉంది. రెస్క్యూ టీమ్ వాహనాన్ని కట్ చేసి మృతుల మృతదేహాలను బయటకు తీశారు. స్థానికుల సహాయంతో పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు.
Pongal Release : 2025 సంక్రాంతి ఇప్పటికే హౌస్ ఫుల్.. రేస్ లోకి మరో స్టార్ హీరో..
ఈ విషయమై మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామ్ చౌదరి మాట్లాడుతూ ఇక్డిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్ఖర్ ఎదురుగా నాలుగు చక్రాల వాహనం, ట్రక్కు ఢీకొన్నట్లు తెలిపారు. ఓ చిన్నారి, బాలిక, పూనమ్ అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన నలుగురి మృతదేహాలు మార్చురీలో భద్రపరిచారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!