ODI World Cup 2027: ముగిసిన 2023 వరల్డ్ కప్.. తర్వాతి ప్రపంచకప్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
45 రోజుల పాటు భారత్లో వరల్డ్ కప్ ఫీవర్ నడిచింది. తాజాగా ఆదివారం ఫైనల్ లో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ తో ప్రపంచ కప్ 2023 పూర్తయింది. అయితే ఈసారి ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంటారని అనుకున్న టీమిండియా అభిమానులకు నిరాశే ఎదురైంది. దీంతో ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా చేతిలో చూడాలంటే ఇంకో నాలుగేళ్లు వేచి చూడాల్సిందే. వన్డే క్రికెట్లో తదుపరి ప్రపంచకప్ 2027లో జరగనుంది. ఈ ప్రపంచకప్కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా.. ఈ మూడు దేశాలు కలిసి తదుపరి ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
Israel-Hamas War: “త్వరలోనే శుభవార్త”.. ఇజ్రాయిల్ పీఎం నెతన్యాహు కీలక వ్యాఖ్యలు..
Also Read
ఆఫ్రికా ఖండంలో ప్రపంచకప్ జరగనుండటం రెండోసారి. అంతకుముందు 2003 ప్రపంచకప్ ఆఫ్రికాలో నిర్వహించారు. అప్పుడు దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో పాటు కెన్యా ప్రపంచకప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చాయి. ఆ ప్రపంచకప్లో.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే గ్రూప్ దశ నుండి నిష్క్రమించాయి. కెన్యా సెమీ-ఫైనల్ వరకు వెళ్లింది. సెమీస్లో టీమిండియా చేతిలో కెన్యా ఓడిపోయింది. 20 ఏళ్ల క్రితం ఆఫ్రికాలో జరిగిన ఈ ప్రపంచకప్ టీమిండియాకు చిరస్మరణీయం. 1983 తర్వాత భారత జట్టు తొలిసారి ప్రపంచకప్ ఫైనల్కు చేరుకుంది. అప్పుడు కూడా ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది.
World Billiards Championship: చరిత్ర సృష్టించిన పంకజ్ అద్వానీ.. 26వ సారి టైటిల్ కైవసం
ఇదిలా ఉంటే.. 2027 ప్రపంచకప్ లో ఆతిథ్య దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఆడుతాయి.. నమీబియా ఆడదు. ఎందుకంటే జట్టు ప్రదర్శన ఆధారంగా తన స్థానాన్ని సంపాదించుకోవలసి ఉంటుంది. నమీబియా ప్రపంచ కప్ ఎంట్రీ ఫార్ములా ఇతర జట్లకు కూడా ఉంటుంది. మరోవైపు.. తదుపరి ప్రపంచకప్లో 14 జట్లు పాల్గొంటాయి. ఇందులో రెండు జట్లను ఇప్పటికే ఖరారు చేశారు. ఆ తర్వాత.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ 8 జట్లు ప్రపంచ కప్ కు అర్హత సాధిస్తాయి. మిగిలిన నాలుగు జట్లు క్వాలిఫయర్ మ్యాచ్ల ద్వారా టోర్నమెంట్లోకి ఎంట్రీ ఇస్తాయి.
Sudigali Sudheer: బాధలో ఉన్నోడికి భయం ఉండదు.. అదిరిపోయిన కాలింగ్ సహస్ర ట్రైలర్
ప్రపంచ కప్ 2027లో 7 జట్లతో కూడిన రెండు గ్రూపులు ఉంటాయి. రౌండ్ రాబిన్ దశ తర్వాత, రెండు గ్రూపుల నుండి టాప్ 3 జట్లు తదుపరి దశకు చేరుకుంటాయి. అంటే రెండో రౌండ్లో 6 జట్లు ఉంటాయి. ఒక గ్రూప్లోని జట్టు మరో గ్రూప్లోని అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ విధంగా, ఈ రౌండ్లో ప్రతి జట్టుకు మూడు మ్యాచ్లు ఉంటాయి. ఈ దశలో రెండు జట్లు ఎలిమినేట్ అవుతాయి.. మిగిలిన జట్లు సెమీ-ఫైనల్ మ్యాచ్ ఆడతారు.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?