Israel-Hamas War: “త్వరలోనే శుభవార్త”.. ఇజ్రాయిల్ పీఎం నెతన్యాహు కీలక వ్యాఖ్యలు..
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 7 నాటి దాడిలో హమాస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసి బందీలుగా చేసుకున్న ఇజ్రాయిలీల విడుదలపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని ఈ రోజు మధ్యవర్తిత్వం చేస్తున్న ఖతార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే కాల్పుల విరమణ, బందీల విడుదల ఉంటుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ నుంచి బందీలను తిరిగి తీసుకురావడంలో మేము పురోగతి సాధిస్తున్నామని మంగళవారం చెప్పారు. ‘‘త్వరలోనే శుభవార్త వస్తుందని నేను ఆశిస్తున్నాను’’ అని ఉత్తరాన ఉన్న సైనిక స్థావరాన్ని సందర్శించిన సమయంలో సైనికులతో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ మా బందీల విదులకు సంబంధించిన పరిణామా దృష్ట్యా మంగళవారం సాయంత్రం వార్ క్యాబినెట్, సెక్యూరిటీ క్యాబినెట్ మరియు ప్రభుత్వం వరసగా సమావేశం కానున్నాయి’’ అని కొద్దిసేపటి తర్వాత ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
Read Also: National Herald case: రాహుల్, సోనియాగాంధీలకు ఈడీ షాక్.. రూ. 752 కోట్ల ఆస్తులు సీజ్..
అక్టోబర్7 నాడు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్పై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 1200 మంది మరణించారు. 240 మంది ఇజ్రాయిలీ పౌరులను కిడ్నాప్ చేసి గాజాలోకి తరలించారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్, హమాస్ స్థావరాలు, ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 13 వేల మంది సాధారణ పౌరులు మరణించారు. తాజాగా బందీల విడుదలపై ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. చర్చలు చివరి దశకు చేరుకున్నాయని ఖతార్ తో పాటు హమాస్ అధిపతి కూడా వెల్లడించాడు.
ఇదిలా ఉంటే తాజాగా చేసిన నెతన్యాహు వ్యాఖ్యల్లో కాల్పుల విరమణ గురించి ప్రస్తావించలేదు. ‘‘మేము భద్రతను పునరుద్ధరించాలనుకుంటున్నాము. మేము చర్యలు తీసుకుంటాము. దక్షిణం, ఉత్తరం రెండింటిపై భద్రతను పెంచుతాము’’ అని అన్నారు. ఇజ్రాయిల్-లెబనాన్ సరిహద్దు్ల్లో పోరాడుతున్న సైనికులకు వందనం చేయాలనుకున్నానని నెతన్యాహు అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!