Israel-Hamas War: “త్వరలోనే శుభవార్త”.. ఇజ్రాయిల్ పీఎం నెతన్యాహు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 7 నాటి దాడిలో హమాస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసి బందీలుగా చేసుకున్న ఇజ్రాయిలీల విడుదలపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని ఈ రోజు మధ్యవర్తిత్వం చేస్తున్న ఖతార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే కాల్పుల విరమణ, బందీల విడుదల ఉంటుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ నుంచి బందీలను తిరిగి తీసుకురావడంలో మేము పురోగతి సాధిస్తున్నామని మంగళవారం చెప్పారు. ‘‘త్వరలోనే శుభవార్త వస్తుందని నేను ఆశిస్తున్నాను’’ అని ఉత్తరాన ఉన్న సైనిక స్థావరాన్ని సందర్శించిన సమయంలో సైనికులతో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ మా బందీల విదులకు సంబంధించిన పరిణామా దృష్ట్యా మంగళవారం సాయంత్రం వార్ క్యాబినెట్, సెక్యూరిటీ క్యాబినెట్ మరియు ప్రభుత్వం వరసగా సమావేశం కానున్నాయి’’ అని కొద్దిసేపటి తర్వాత ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.
Also Read
- Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Houthis Attack Saudi: టర్కీ-పాక్తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
Read Also: National Herald case: రాహుల్, సోనియాగాంధీలకు ఈడీ షాక్.. రూ. 752 కోట్ల ఆస్తులు సీజ్..
అక్టోబర్7 నాడు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్పై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 1200 మంది మరణించారు. 240 మంది ఇజ్రాయిలీ పౌరులను కిడ్నాప్ చేసి గాజాలోకి తరలించారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్, హమాస్ స్థావరాలు, ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 13 వేల మంది సాధారణ పౌరులు మరణించారు. తాజాగా బందీల విడుదలపై ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. చర్చలు చివరి దశకు చేరుకున్నాయని ఖతార్ తో పాటు హమాస్ అధిపతి కూడా వెల్లడించాడు.
ఇదిలా ఉంటే తాజాగా చేసిన నెతన్యాహు వ్యాఖ్యల్లో కాల్పుల విరమణ గురించి ప్రస్తావించలేదు. ‘‘మేము భద్రతను పునరుద్ధరించాలనుకుంటున్నాము. మేము చర్యలు తీసుకుంటాము. దక్షిణం, ఉత్తరం రెండింటిపై భద్రతను పెంచుతాము’’ అని అన్నారు. ఇజ్రాయిల్-లెబనాన్ సరిహద్దు్ల్లో పోరాడుతున్న సైనికులకు వందనం చేయాలనుకున్నానని నెతన్యాహు అన్నారు.
తాజావార్తలు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్తో బాలీవుడ్లో కలకలం
-
Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!