Sameer Rizvi: 8 రోజుల్లో 2 డబుల్ సెంచరీలు.. 2 సెంచరీలు, ఢీసీకి పంట పండినట్టే..!
- అండర్-23 వన్డే స్టేట్ ఎ టోర్నీలో చెలరేగిన సమీర్ రిజ్వీ
- 8 రోజుల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన సమీర్ రిజ్వీ
- ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడనున్న సమీర్ రిజ్వీ.
అండర్-23 వన్డే స్టేట్ ఎ టోర్నీలో స్టార్ బ్యాట్స్మెన్ సమీర్ రిజ్వీ చెలరేగాడు. బుధవారం (డిసెంబర్ 25) నాటికి 8 రోజుల్లో రెండు డబుల్ సెంచరీలు చేశాడు. అంతేకాకుండా.. 2 శతకాలు కూడా బాదాడు. వడోదరలోని జిఎస్ఎఫ్సి క్రికెట్ గ్రౌండ్లో ఉత్తరప్రదేశ్, విదర్భ మధ్య మ్యాచ్ గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విదర్భ.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 406 పరుగులు చేసింది. డానిష్ మలేవార్ 142 పరుగులు చేయగా, కెప్టెన్ మహ్మద్ ఫైజ్ 100 పరుగులు చేశాడు.
లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉత్తరప్రదేశ్ 41.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 409 పరుగులు చేసి విజయం సాధించింది. నాలుగో నంబర్లో బ్యాటింగ్కి వచ్చిన యూపీ కెప్టెన్ సమీర్ రిజ్వీ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించి నాటౌట్గా నిలిచాడు. సమీర్ రిజ్వీ 105 బంతుల్లో 10 ఫోర్లు, 18 సిక్సర్ల సాయంతో 202 పరుగులు చేశాడు. సమీర్ రిజ్వీ నాలుగు రోజుల క్రితం వడోదరలోని కోటంబి బి మైదానంలో త్రిపుర అండర్-23తో జరిగిన మ్యాచ్లో మరో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 97 బంతుల్లో 201 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అందులో 13 ఫోర్లు, 20 సిక్సర్లు బాదాడు. టోర్నీలో ఇదే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ.
Also Read
- E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
- Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
Read Also: Iqra Hasan: ఇమ్రాన్ ప్రతాప్గఢీతో పెళ్లిపై ఎస్పీ మహిళా ఎంపీ ఏమన్నారంటే..!
అంతకుముందు హిమాచల్ ప్రదేశ్పై (19 డిసెంబర్ 2024) 153 పరుగులు, పాండిచ్చేరిపై (17 డిసెంబర్ 2024) 137 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అండర్-23 టోర్నీలో 6 ఇన్నింగ్స్ల తర్వాత సమీర్ రిజ్వీ ఖాతాలో 728 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అతను 52 ఫోర్లు, 64 సిక్సర్లు కొట్టాడు. గత ఎడిషన్లోనూ ఉత్తరప్రదేశ్ అండర్-23కి స్టార్గా నిలిచాడు. గతేడాది ఫైనల్లో ఉత్తరప్రదేశ్ విజయంలో సమీర్ రిజ్వీ కీలక పాత్ర పోషించాడు. 50 బంతుల్లో 83 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో కూడా ఉత్తరప్రదేశ్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే.. సమీర్ రిజ్వీ విజయ్ హజారే ట్రోఫీకి జట్టులో ఎంపిక కాలేదు. అతను విజయ్ హజారే ట్రోఫీ జట్టు నుండి తొలగించబడటానికి ముందు 8 ఇన్నింగ్స్లలో 136 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ మెగా వేలానికి ముందు అతన్ని విడుదల చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సమీర్ రిజ్వీని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 95 లక్షలకు కొనుగోలు చేసింది. సమీర్ రిజ్వీ బేస్ ధర రూ.30 లక్షలు. అయితే ఇప్పటి వరకూ అద్భుత ప్రదర్శన కనబరిచిన సమీర్ రిజ్వీ.. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్కు పరుగుల వరద పారించనున్నాడు.
తాజావార్తలు
-
E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
-
Supplementary exams: పది ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్.. జూన్ 5 నుంచి పరీక్షలు..
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో