Sameer Rizvi: 8 రోజుల్లో 2 డబుల్ సెంచరీలు.. 2 సెంచరీలు, ఢీసీకి పంట పండినట్టే..!
- అండర్-23 వన్డే స్టేట్ ఎ టోర్నీలో చెలరేగిన సమీర్ రిజ్వీ
- 8 రోజుల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన సమీర్ రిజ్వీ
- ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడనున్న సమీర్ రిజ్వీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అండర్-23 వన్డే స్టేట్ ఎ టోర్నీలో స్టార్ బ్యాట్స్మెన్ సమీర్ రిజ్వీ చెలరేగాడు. బుధవారం (డిసెంబర్ 25) నాటికి 8 రోజుల్లో రెండు డబుల్ సెంచరీలు చేశాడు. అంతేకాకుండా.. 2 శతకాలు కూడా బాదాడు. వడోదరలోని జిఎస్ఎఫ్సి క్రికెట్ గ్రౌండ్లో ఉత్తరప్రదేశ్, విదర్భ మధ్య మ్యాచ్ గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విదర్భ.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 406 పరుగులు చేసింది. డానిష్ మలేవార్ 142 పరుగులు చేయగా, కెప్టెన్ మహ్మద్ ఫైజ్ 100 పరుగులు చేశాడు.
లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉత్తరప్రదేశ్ 41.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 409 పరుగులు చేసి విజయం సాధించింది. నాలుగో నంబర్లో బ్యాటింగ్కి వచ్చిన యూపీ కెప్టెన్ సమీర్ రిజ్వీ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించి నాటౌట్గా నిలిచాడు. సమీర్ రిజ్వీ 105 బంతుల్లో 10 ఫోర్లు, 18 సిక్సర్ల సాయంతో 202 పరుగులు చేశాడు. సమీర్ రిజ్వీ నాలుగు రోజుల క్రితం వడోదరలోని కోటంబి బి మైదానంలో త్రిపుర అండర్-23తో జరిగిన మ్యాచ్లో మరో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 97 బంతుల్లో 201 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అందులో 13 ఫోర్లు, 20 సిక్సర్లు బాదాడు. టోర్నీలో ఇదే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ.
Also Read
- SIR in Telangana: తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే..!
- Black Magic Fraud: ఆడవేషాలు వేస్తూ.. కిలాడీ మోసాలు చేస్తున్న కేటుగాడు!
- Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్తో 'రాగి రొట్టెలు' చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
- FIFA World Cup 2026: 'కురాకో'కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
Read Also: Iqra Hasan: ఇమ్రాన్ ప్రతాప్గఢీతో పెళ్లిపై ఎస్పీ మహిళా ఎంపీ ఏమన్నారంటే..!
అంతకుముందు హిమాచల్ ప్రదేశ్పై (19 డిసెంబర్ 2024) 153 పరుగులు, పాండిచ్చేరిపై (17 డిసెంబర్ 2024) 137 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అండర్-23 టోర్నీలో 6 ఇన్నింగ్స్ల తర్వాత సమీర్ రిజ్వీ ఖాతాలో 728 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అతను 52 ఫోర్లు, 64 సిక్సర్లు కొట్టాడు. గత ఎడిషన్లోనూ ఉత్తరప్రదేశ్ అండర్-23కి స్టార్గా నిలిచాడు. గతేడాది ఫైనల్లో ఉత్తరప్రదేశ్ విజయంలో సమీర్ రిజ్వీ కీలక పాత్ర పోషించాడు. 50 బంతుల్లో 83 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో కూడా ఉత్తరప్రదేశ్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే.. సమీర్ రిజ్వీ విజయ్ హజారే ట్రోఫీకి జట్టులో ఎంపిక కాలేదు. అతను విజయ్ హజారే ట్రోఫీ జట్టు నుండి తొలగించబడటానికి ముందు 8 ఇన్నింగ్స్లలో 136 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ మెగా వేలానికి ముందు అతన్ని విడుదల చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సమీర్ రిజ్వీని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 95 లక్షలకు కొనుగోలు చేసింది. సమీర్ రిజ్వీ బేస్ ధర రూ.30 లక్షలు. అయితే ఇప్పటి వరకూ అద్భుత ప్రదర్శన కనబరిచిన సమీర్ రిజ్వీ.. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్కు పరుగుల వరద పారించనున్నాడు.
తాజావార్తలు
-
SIR in Telangana: తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే..!
-
Kollywood Movie Updates : తమిళ హీరోలకు రెమ్యూనరేషన్ కష్టాలు… నిన్న అజిత్ నేడు విక్రమ్
-
Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు చుక్కలే.. భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు
-
Black Magic Fraud: ఆడవేషాలు వేస్తూ.. కిలాడీ మోసాలు చేస్తున్న కేటుగాడు!
-
SpaceX IPO: స్పేస్ఎక్స్ ఐపీఓ సంచలనం.. కోటీశ్వరులైన 4,400 మందికి పైగా ఉద్యోగులు!
ట్రెండింగ్
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!
-
Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్పై హర్మన్ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!