Aircraft Crash: ఇంటిపై కుప్పకూలిన మిగ్-21 విమానం.. ముగ్గురు పౌరులు మృతి.. పైలట్ సేఫ్
Aircraft Crash: వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానం రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లా కూలిపోయింది. భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 సోమవారం రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో ఓ ఇంటిపై కూలిపోయిందని, ముగ్గురు గ్రామస్థులు ప్రాణాలు కోల్పోగా, పైలట్ సురక్షితంగా ఉన్నారని రక్షణ వర్గాలు తెలిపాయి. హనుమాన్గఢ్ జిల్లాలోని పిలిబంగా సమీపంలో సాంకేతిక లోపం కారణంగా సూరత్గఢ్ ఎయిర్బేస్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. పైలట్ సకాలంలో పారాచూట్ ఉపయోగించి విమానం నుండి దూకాడని, అతను సురక్షితంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్కు స్వల్ప గాయాలయ్యాయని, ఘటనపై విచారణకు ఆదేశించామని వైమానిక దళం తెలిపింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్థానికులు ప్రాణాలు కోల్పోగా.. పైలట్ సురక్షితంగా ఉన్నారని, సహాయక చర్యల కోసం సైన్యానికి చెందిన హెలికాప్టర్ ప్రమాద స్థలానికి చేరుకుందని తెలిసింది. ఐఏఎఫ్ వర్గాల సమాచారం ప్రకారం విమానం సూరత్గఢ్ నుండి బయలుదేరింది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
“ఈరోజు ఉదయం సాధారణ శిక్షణలో భాగంగా సూరత్గఢ్ సమీపంలో ఐఏఎఫ్కి చెందిన మిగ్-21 విమానం కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ ఏర్పాటు చేయబడింది” అని వాయుసేన ట్వీట్ చేసింది. విమానం కూలిపోయిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. “పైలట్ మానవ ప్రాణనష్టాన్ని నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. గ్రామ శివార్లలో విమానాన్ని క్రాష్-ల్యాండ్ చేసాడు” అని బికనీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓం ప్రకాష్ తెలిపారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Read Also: Pak Flight: భారత గగనతలంలోకి పాక్ విమానం.. వర్షం దెబ్బకు దారి తప్పిందట!
ఇటీవల విమాన ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. జనవరిలో భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు సుఖోయ్ సు -30, మిరాజ్ 2000 కూలిపోవడంతో ఒక పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్లోని మొరెనాలో ఒక విమానం కూలిపోగా, మరొకటి రాజస్థాన్లోని భరత్పూర్లో కూలిపోయింది. గత వారం ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఏప్రిల్లో కొచ్చిలో ట్రయల్స్ సమయంలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ చేయడంతో మరో ప్రమాదం జరిగింది. ఈ మార్చిలో ముంబైలో నేవీ హెలికాప్టర్ కుప్పకూలింది. గత ఏడాది అక్టోబర్లో అరుణాచల్ ప్రదేశ్లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన రెండు సంఘటనలు నమోదయ్యాయి. అక్టోబరు 5, 2022లో, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతానికి సమీపంలో చీతా హెలికాప్టర్ కూలిపోవడంతో ఒక భారతీయ ఆర్మీ పైలట్ మరణించాడు.
#WATCH | Indian Air Force MiG-21 fighter aircraft crashed near Hanumangarh in Rajasthan. Two civilian women died and a man was injured in the incident, the pilot sustained minor injuries. pic.twitter.com/z4BZBsECVV
— ANI (@ANI) May 8, 2023
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో