Aircraft Crash: ఇంటిపై కుప్పకూలిన మిగ్-21 విమానం.. ముగ్గురు పౌరులు మృతి.. పైలట్ సేఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aircraft Crash: వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానం రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లా కూలిపోయింది. భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 సోమవారం రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో ఓ ఇంటిపై కూలిపోయిందని, ముగ్గురు గ్రామస్థులు ప్రాణాలు కోల్పోగా, పైలట్ సురక్షితంగా ఉన్నారని రక్షణ వర్గాలు తెలిపాయి. హనుమాన్గఢ్ జిల్లాలోని పిలిబంగా సమీపంలో సాంకేతిక లోపం కారణంగా సూరత్గఢ్ ఎయిర్బేస్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. పైలట్ సకాలంలో పారాచూట్ ఉపయోగించి విమానం నుండి దూకాడని, అతను సురక్షితంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్కు స్వల్ప గాయాలయ్యాయని, ఘటనపై విచారణకు ఆదేశించామని వైమానిక దళం తెలిపింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్థానికులు ప్రాణాలు కోల్పోగా.. పైలట్ సురక్షితంగా ఉన్నారని, సహాయక చర్యల కోసం సైన్యానికి చెందిన హెలికాప్టర్ ప్రమాద స్థలానికి చేరుకుందని తెలిసింది. ఐఏఎఫ్ వర్గాల సమాచారం ప్రకారం విమానం సూరత్గఢ్ నుండి బయలుదేరింది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
“ఈరోజు ఉదయం సాధారణ శిక్షణలో భాగంగా సూరత్గఢ్ సమీపంలో ఐఏఎఫ్కి చెందిన మిగ్-21 విమానం కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ ఏర్పాటు చేయబడింది” అని వాయుసేన ట్వీట్ చేసింది. విమానం కూలిపోయిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. “పైలట్ మానవ ప్రాణనష్టాన్ని నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. గ్రామ శివార్లలో విమానాన్ని క్రాష్-ల్యాండ్ చేసాడు” అని బికనీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓం ప్రకాష్ తెలిపారు.
Also Read
- Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
- Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
- Russian Ruble: డాలర్కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
- Modi-Meloni Selfie Goes Viral: వైరల్గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
Read Also: Pak Flight: భారత గగనతలంలోకి పాక్ విమానం.. వర్షం దెబ్బకు దారి తప్పిందట!
ఇటీవల విమాన ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. జనవరిలో భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు సుఖోయ్ సు -30, మిరాజ్ 2000 కూలిపోవడంతో ఒక పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్లోని మొరెనాలో ఒక విమానం కూలిపోగా, మరొకటి రాజస్థాన్లోని భరత్పూర్లో కూలిపోయింది. గత వారం ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఏప్రిల్లో కొచ్చిలో ట్రయల్స్ సమయంలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ చేయడంతో మరో ప్రమాదం జరిగింది. ఈ మార్చిలో ముంబైలో నేవీ హెలికాప్టర్ కుప్పకూలింది. గత ఏడాది అక్టోబర్లో అరుణాచల్ ప్రదేశ్లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన రెండు సంఘటనలు నమోదయ్యాయి. అక్టోబరు 5, 2022లో, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతానికి సమీపంలో చీతా హెలికాప్టర్ కూలిపోవడంతో ఒక భారతీయ ఆర్మీ పైలట్ మరణించాడు.
#WATCH | Indian Air Force MiG-21 fighter aircraft crashed near Hanumangarh in Rajasthan. Two civilian women died and a man was injured in the incident, the pilot sustained minor injuries. pic.twitter.com/z4BZBsECVV
— ANI (@ANI) May 8, 2023
తాజావార్తలు
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
-
Riyan Parag: మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి.. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు!
-
TeluguOne Ravi Shankar: పంచభూతాల సాక్షిగా డైరెక్టర్గా మారిన తెలుగు వన్ రవిశంకర్!
-
Russian Ruble: డాలర్కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?