Pak Flight: భారత గగనతలంలోకి పాక్ విమానం.. వర్షం దెబ్బకు దారి తప్పిందట!
Pak Flight: పాకిస్థాన్కు చెందిన ఓ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించింది. ల్యాండింగ్ సమస్య కారణంగా పది నిమిషాల పాటు మన దేశ పరిధిలో చక్కర్లు కొట్టింది. పేలవమైన వాతావరణం వల్ల పాక్ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడంతో వైమానిక దళం నిఘా ఉంచింది. ఆ సమయంలో పైలట్.. విమానాన్ని 23 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఓ మీడియా ప్రచురించడం వల్ల వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా లాహోర్ విమానాశ్రయంలో ల్యాండ్ కావడం విఫలమైన తర్వాత.. గత వారం భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ బోయింగ్ 777 జెట్లైనర్ను భారత వైమానిక దళం నిశితంగా పరిశీలిస్తోంది.
మే 4న, పాకిస్తానీ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (PIA) ఫ్లైట్ బోయింగ్ 777 (పీకే-248) మస్కట్ నుంచి లాహోర్లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. ఆ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ను నిలిపివేయవలసి వచ్చింది. అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు లాహోర్ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. ఆ సమయంలో లాహోర్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ విమానం ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అప్రమత్తమైందని, ఆ ప్రాంతంలోని వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని బోయింగ్ను పక్కదారి పట్టించాలని అభ్యర్థనను ప్రాసెస్ చేసినట్లు తెలిసింది.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Read Also: Tamil Nadu Cops: తీహార్ జైలులో గ్యాంగ్స్టర్ హత్య.. ఏడుగురు తమిళనాడు పోలీసులపై సస్పెన్షన్ వేటు
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచనలు మేరకు పైలట్, గో- అరౌండ్ విధానాన్ని ప్రారంభించాడు. లాహోర్ పరిసరాల్లో చక్కర్లు కొట్టాడు. వర్షం భారీగా కురుస్తుండడం, తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఉండడం వల్ల దారి తప్పి భారత్లోకి ప్రవేశించినట్లు తెలిసింది. ఆ సమయంలో 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానాన్ని 23వేల అడుగుల ఎత్తులోకి తీసుకెళ్లాడు. పంజాబ్లోని తరణ్ సాహిబ్, రసూల్పుర్ నగరం గుండా వివిధ ప్రాంతాల్లో ప్రయాణించిన ఆ విమానం కాసేపటికి తిరిగి పాకిస్థాన్లోని ముల్తాన్కు చేరుకుంది. మొత్తం భారత్ గగనతలంలో దాదాపు పది నిమిషాల పాటు చక్కర్లు కొట్టిన పాక్ విమానం.. 120 కిలోమీటర్లు మేర ప్రయాణించింది. లాహోర్ భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్నప్పటికీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఎల్లప్పుడూ విమానాల సురక్షిత కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో