MiG-21: ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) మిగ్-21 జెట్ ఫ్లీట్ ను నిలిపివేశాయి. మే 8న రాజస్థాన్ హనుమాన్ గఢ్ గ్రామంలో మిగ్ -21 బైసన్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సూరత్గఢ్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన మిగ్-21 సాంకేతిక కారణాలతో కూలిపోయింది.
వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానం రాజస్థాన్లోని హనుమాన్గఢ్లో కూలిపోయింది. భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 సోమవారం రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో కూలిపోయిందని, పైలట్ సురక్షితంగా ఉన్నారని రక్షణ వర్గాలు తెలిపాయి.
దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో కన్న కొడుకు ప్రాణాలు కోల్పోయాడని తెలిసి ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు వెళ్లిన కుటుంబసభ్యులకు విమానంలో షాకింగ్ అనుభవం ఎదురైంది. కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని అందరికంటే ముందుగా విమానం నుంచి దింపేందుకు విమాన సిబ్బంది ప్రయత్నించగా తోటి ప్రయాణికులు కనీసం పట్టించుకోలేదు.
భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్లోని బర్మర్ జిల్లాలో ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. కూలిన మిగ్-21 విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు భారత వైమానిక దళం వెల్లడించింది.