Amanatullah Khan: మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యేకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..
- మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యేకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
- అమానతుల్లా ఖాన్ను జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ఢిల్లీ కోర్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మనీలాండరింగ్ కేసులో14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ స్వయంగా కోర్టును అభ్యర్థించింది. ఇకపై నిందితులను కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదని ప్రత్యేక న్యాయమూర్తికి ఈడీ తెలిపింది. అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని.. అమానతుల్లా ఖాన్ను విడుదల చేస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయగలరని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది.
Minister Kollu Ravindra: సహాయక చర్యల్లో గాయపడిన కానిస్టేబుల్కు రూ.2 లక్షల ఆర్థిక సాయం
Also Read
ఈ క్రమంలో.. కోర్టు ఆదేశాల వచ్చేంత వరకు అమానతుల్లా ఖాన్ సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. గతంలో రిమాండ్లో ఉన్న సమయంలో అమానతుల్లా ఖాన్ విచారణకు సహకరించలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. మరోవైపు.. అమానతుల్లా ఖాన్ తరపు న్యాయవాది ఈడీ వాదనలను వ్యతిరేకించారు. ఈ క్రమంలో.. తన క్లయింట్ను విడుదల చేయాలని కోర్టును అభ్యర్థించారు. బెయిల్ మంజూరు కోసం అమానతుల్లా ఖాన్కు కోర్టు ఎలాంటి షరతునైనా విధించవచ్చని లాయర్ చెప్పారు. గత శుక్రవారం, ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగానే అమానతుల్లా ఖాన్కు మూడు రోజుల పాటు ఈడీ కస్టడీని పొడిగించింది. ఈ క్రమంలో.. ఈడీ అమానతుల్లా ఖాన్ను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. అమానతుల్లా తన సహ నిందితులు.. దాదాపు 48 మంది సాక్షులను విచారించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.
Indonesia: ఇండోనేషియాలో విమానం ప్రమాదం.. రన్వే నుంచి జారిపడ్డ ఫ్లైట్
మూడు రోజుల కస్టడీ అనంతరం.. సెప్టెంబర్ 9న కోర్టులో హాజరుకావాలని అమానతుల్లా ఖాన్ను కోర్టు కోరింది. ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలోని ఆయన నివాసంలో సోదాలు చేసిన తర్వాత సెప్టెంబర్ 2న పిఎంఎల్ఎ నిబంధనల ప్రకారం.. అమానతుల్లా ఖాన్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. సోదాల సందర్భంగా అమానతుల్లా ఖాన్ను ఆరోపణలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగారని, అయితే అతను సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో అతడిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్బోర్డ్లో నియామకాలు, ఆ సంస్థకు చెందిన రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తుల లీజుకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..