Heart Attack: గుజరాత్కు గుండెపోటు..! 6 నెలల్లో 1,052 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heart Attack: అసలేం జరుగుతోంది. ఉత్సాహంతో ఉండాల్సి యువ గుండెలు అలసిపోతున్నాయెందుకు..? రెండు పదుల వయస్సు పూర్తవ్వకుండానే గుండెపోటేంటి? గుజరాత్లో యువకుల అకాల మరణాలేంటి..? ఇప్పుడు ఇదే దేశంలో నడుస్తున్న చర్చ. కేంద్ర ప్రభుత్వం నుంచి, పక్క రాష్ట్రాల వరకు గుజరాత్ పరిస్థితిపై ఆరా తీస్తున్నాయి. గుండెపోటు కారణంగా గుజరాత్లో ఆరు నెలల్లో 1052 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 11 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు వారే 80 శాతం మంది హార్ట్ ఎటాక్తో మరణించినట్లు గుజరాత్ ప్రభుత్వం చెబుతోంది. గుండెపోటు ఘటనలు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 2 లక్షల మంది టీచర్లు, కాలేజీ ప్రొఫెసర్లకు సీపీఆర్పై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
Read Also: Krishna Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంచాయతీ.. నేడు సీడబ్ల్యూసీ సమావేశం
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
విద్యార్థులు, యువకులకు ఊబకాయులు కూడా కాదు. హృదయ సంబంధిత కారణాలతో రోజుకు సగటున 173 కాల్స్ ఎమర్జెన్సీ విభాగానికి వస్తున్నాయి. బాధితుల్లో ఎక్కువగా చిన్నవయసు వారే ఉండటంతో గుండెపోటుపై యువకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. క్రికెట్ ఆడుతుండగా, గార్బా నృత్యం చేస్తున్న సమయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని గుజరాత్ విద్యాశాఖ తెలిపింది. దీంతో టీచర్లు సీపీఆర్పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో పాలుపంచుకోవాలని, ఉపాధ్యాయులందరూ భాగస్వామ్యం కావాలని సూచించింది గుజరాత్ ప్రభుత్వం. దాదాపు రెండు లక్షల మంది టీచర్లకు ఇవ్వనుంది. ఇందులో 2500 మంది వైద్య నిపుణులు పాల్గొంటారు. తద్వారా.. గుండెపోటు మరణాలను కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: Tirumala Tour: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే తిరుమల టూర్
రాష్ట్ర విద్యాశాఖ చొరవతో దాదాపు రెండు లక్షల మంది పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులకు శిక్షణ అందించేందుకు డిసెంబర్ 3 నుంచి 17వ తేదీ మధ్య 37 వైద్య కళాశాలల్లో సీపీఆర్ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ శిక్షణా శిబిరాల్లో సుమారు 2,500 మంది వైద్య నిపుణులు మరియు వైద్యులు పాల్గొంటారు మరియు పాల్గొనేవారికి ధృవపత్రాలు కూడా అందించబడతాయి అంటున్నారు. రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు పోలీసు సిబ్బందికి ఇటువంటి శిక్షణ ఇంతకు ముందు ఇవ్వబడిందని గుర్తుచేస్తున్నారు.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!