World’s Highest Railway Bridge: 2 దశాబ్ధాల కాశ్మీర్ ప్రజల కల.. ప్రారంభానికి సిద్ధం అవుతున్న చీనాబ్ వంతెన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World’s Highest Railway Bridge: రెండు దశాబ్ధాల జమ్మూ కాశ్మీర్ ప్రజల కల నెలవేరబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైల్వే బ్రిడ్జ్ గా, ఇంజనీరింగ్ అధ్భుతంగా కొనియాడుతున్న చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన త్వరలో ప్రారంభం కాబోతోంది. ప్రపంచంలో ఎతైన రైల్వే వంతెన 359 మీటర్లు (1,178 అడుగులు) ఎత్తులో చీనాబ్ నదిపై ఉంది. ఇది పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల కన్నా ఎత్తు ఉంటుంది.
జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని బక్కల్, కౌరీ మధ్య నదిపై ఈ వంతెనను నిర్మించింది భారత ప్రభుత్వం. ఇది కట్రా, బనిహాల్ మధ్య కీలకమైన లింక్ గా ఉంది. ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా(యఎస్బీఆర్ఎల్) రైల్వే లింకులో భాగంగా ఉంది. ఈ ప్రాజెక్టును రూ. 30,000 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా రూ.1400 కోట్లతో ఈ వంతెన నిర్మాణం జరిగింది. ప్రస్తుతం అన్ని సేఫ్టీ పరీక్షల్లో వంతెన పాస్ అయింది. 2003లో ప్రాజెక్టు ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్టు రెండు దశాబ్ధాల కాశ్మీరీ ప్రజల కల. అయితే అక్కడి పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు ఆలస్యం అయింది. చివరకు 2008లో అప్పటి ప్రభుత్వం వంతెన నిర్మాణ కాంట్రాక్టులను ఓకే చేసింది.
Also Read
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
- PM Modi: ఆందోళన వద్దు.. ధైర్యంగా ఉండండి.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
- Supreme Court: 'గుడ్లకు భయమెందుకు?'.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
Read Also: Tigers Death: చంద్రాపూర్, మంచిర్యాలల్లో పులుల మరణాలు.. ముగ్గురి అరెస్ట్
చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అన్ని పరీక్షలు నిర్వహించామని, అవన్నీ విజయవంతం అయినట్లు కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ వంతెన అధిక గాలులు, ఉష్ణోగ్రత, భూకంపాలను తట్టుకుంటుందా..? అనే పరీక్షలు నిర్వహించారు. వంతెన ప్రారంభానికి సిద్ధంగా ఉందని, వంతెనపై రైల్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రియాసి పట్టణానికి 42 కిలోమీటర్ల దూరంలోని ఉన్న ఈ వంతెనను స్టీల్, కాంక్రీట్ తో ఆర్చ్ నిర్మాణంలో నిర్వించారు. దీని పునాది పనులు నవంబర్ 2017న పూర్తయ్యాయి. ఈ వంతెన గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకుని 120 ఏళ్ల పాటు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బ్రిడ్జ్ తో పాటు 12.7 కిలోమీటర్ల సొరంగాన్ని యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులో చేపట్టనున్నారు. ఇండియా చరిత్రలో ఏ రైల్వే ప్రాజెక్టు ఎదుర్కోలేని సవాళ్లను ఈ బ్రిడ్జ్ ఎదుర్కొంది.
తాజావార్తలు
-
Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!
-
TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
-
Varun Tej : ‘ఎన్టీఆర్ను టార్గెట్ చేయలేదు’.. ట్రోల్స్పై వరుణ్ తేజ్ క్లారిటీ..
-
Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
-
Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!