జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. రియాసి జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో 10 నెలల బాలుడితో సహా ముగ్గురు మృతి చెందారు. కొండ రహదారిపై నుంచి వెళ్తుండగా కారు ప్రమాదవశాత్తు లోతైన లోయలో పడిపోయింది. దీంతో.. ఒక మహిళ, ఆమె 10 నెలల కొడుకుతో సహా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
జమ్మూకాశ్మీర్లో బుధవారం రెండో విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పా్ట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు తీసుకుని బూత్ సెంటర్లకు చేరుకుంటున్నారు. జమ్మూకాశ్మీర్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత సెప్టెంబర్ 18న ప్రశాంతంగా ముగిసింది. రెండో విడత సెప్టెంబర్ 25న జరగనుంది.
World's Highest Railway Bridge: రెండు దశాబ్ధాల జమ్మూ కాశ్మీర్ ప్రజల కల నెలవేరబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైల్వే బ్రిడ్జ్ గా, ఇంజనీరింగ్ అధ్భుతంగా కొనియాడుతున్న చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన త్వరలో ప్రారంభం కాబోతోంది. ప్రపంచంలో ఎతైన రైల్వే వంతెన 359 మీటర్లు (1,178 అడుగులు) ఎత్తులో చీనాబ్ నదిపై ఉంది. ఇది పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల కన్నా ఎత్తు ఉంటుంది.