UP: యూపీలో మరో దారుణం.. ప్రియుడి సలహాతో అన్నంలో విషం పెట్టి భర్తను చంపేసిన భార్య
- యూపీలో మరో దారుణం
- ప్రియుడి సలహాతో అన్నంలో విషం పెట్టి భర్తను చంపేసిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు మహిళల అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాళ్లనే కాటికి పంపేస్తున్నారు. మొన్నటికి మొన్న మీరట్లో భర్తను చంపి డ్రమ్ములో సిమెంట్తో కప్పేసింది ఓ ఇల్లాలు. అది మరువక ముందే హనీమూన్ పేరుతో మేఘాలయలో భర్తను ఒక నవ వధువు చంపేసింది. ఇలా దేశంలో ఎక్కడొక చోట నారీమణుల వికృత చర్యలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో మరో ఇల్లాలి దురాగతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Finance Scam: ఫైనాన్స్ ముసుగులో దారుణాలు.. వెలుగులోకి తండ్రీకొడుకుల బాగోతం..!
Also Read
- Ketan Agarwal Case: అమ్మో ‘సియా’.. సోనమ్ కంటే జిత్తులమారి.. నవ్వుతో చక్కబెట్టేసింది
- Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
సునీల్, శశిదేవి భార్యాభర్తలు. అయితే యాదవేంద్రతో శశిదేవికి వివాహేతర సంబంధం ఉంది. ఇదంతా రహస్యంగా కానిచ్చేస్తోంది. అయితే ప్రియుడితో ఉండేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రేమికుడి సాయంతో ఆన్లైన్లో విషాన్ని ఆర్డర్ చేసింది. అనంతరం మే 13న భర్తకు పెరుగులో కలిపి చంపేసింది. అయితే సహజ మరణంగా అందరినీ నమ్మించడంతో సమాధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంఘటన ఉలావ్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: MLC Kavitha: ఎవరైనా సరే.! నాయకులుగా ఎదగాలనుకుంటే మీ వెంటే ‘జాగృతి’..
అయితే తాజాగా శశిదేవి.. యాదవేంద్రతో కలిసి సన్నిహితంగా ఉండడంతో సునీల్ కుటుంబీకులు గమనించారు. దీంతో బాధిత కుటుంబం జూలై 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా.. నిందితులు నేరాన్ని అంగీకరించారు. పెరుగులో విషం కలిపి చంపేసినట్లుగా నిందితురాలు ఒప్పుకుంది. తన ప్రియుడి సాయంతో ఆన్లైన్లో విషాన్ని రప్పించి చంపేసినట్లు తెలిపింది.
అయితే సునీల్ను చంపడం ఇది మొదటి ప్రయత్నం కాదని.. రెండో ప్రయత్నంలో మే 13న విషం కలపడంతో చనిపోయాడని పోలీసులు తెలిపారు. శశి దేవి, ప్రేమికుడు యాదవేంద్రనీ అరెస్టు చేసి జైలుకు పంపారు. నిందితులిద్దరూ వివాహితులని, చాలా కాలంగా వివాహేతర సంబంధంలో ఉన్నారని దర్యాప్తు అధికారులు చెప్పారు. శశి, సునీల్ వివాహం చేసుకుని 12 సంవత్సరాలు అయిందని పేర్కొన్నారు.
#WATCH | Uttar Pradesh | Firozabad City SP Ravi Shankar Prasad says, "A case was registered on July 24 in which the plaintiff from Ulau, under Tundla police station, accused her daughter-in-law and a man from the same village of poisoning her son Sunil… Both the accused have… pic.twitter.com/quly36M8bX
— ANI (@ANI) July 26, 2025
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!