UP: మీరట్ తరహా మర్డర్.. “ప్రభుత్వ ఉద్యోగం” కోసం భర్తని హత్య చేసిన భార్య..
- రైల్వే ఉద్యోగం కోసం భర్తని చంపిన భార్య..
- యూపీ బిజ్నోర్లో మీరట్ తరహా మర్డర్..
- గుండెపోటుగా నమ్మించేందుకు యత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: ఉత్తర్ ప్రదేశ్ బిజ్నోర్ పట్టణంలో ‘‘మీరట్’’ తరహా మర్డర్ సంచలనంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం భార్యనే భర్తను చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బిజ్నోర్ నజీబాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంతో ఈ ఘటన జరిగింది. రైల్వే టెక్నీషియన్గా పనిచేస్తున్న దీపక్ కుమార్ని అతడి భార్య శివాని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన భర్త గుండెపోటుతో మరణించినట్లు ముందుగా శివాని చెప్పింది.
Read Also: Punjab: బీజేపీ నేత ఇంటిపై గ్రెనేడ్ దాడి.. పాకిస్తానీతో సహా ఇద్దరు అరెస్ట్..
Also Read
- TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
- CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
అయితే, దీపక్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో కుటుంబం పోస్టుమార్టం నిర్వహించాలని పట్టుబట్టింది. దీంట్లో దీపక్ కుమార్ గొంతు నులిమి చంపినట్లు తేలింది. శివానీతో పాటు మరో వ్యక్తి కలిసి భర్త ఉద్యోగం కోసం హత్య చేసి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సంఘటన జరిగిన ఏప్రిల్ 04న, శివాని తన మరిది పియూష్కి దీపక్కి గుండెపోటు వచ్చిందని సమాచారం ఇచ్చింది. అతడు వెళ్లే లోపే దీపక్ చనిపోయాడు. అయితే, శివానీ పోస్టుమార్టం నిర్వహించడానికి వ్యతిరేకత వ్యక్తం చేయడంతో కుటుంబం ఆమె తీరును అనుమానించింది.
దీపక్ని శివానీ మరో వ్యక్తి కలిసి హత్య చేసిన ఉంటారని దీపక్ సోదరుడు పియూష్ ఆరోపించాడు. దీపక్, శివానీలు ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరు నెలల బాబు ఉన్నాడు. శివానీ తన అత్తగారిని కూడా శారీరకంగా హింసించేదని ఆరోపణలు ఉన్నాయి. విచారణలో శివానీ దీపక్ కి నిద్రమాత్రలు ఇచ్చి, స్పృహ కోల్పోయేలా చేసిందని వెల్లడైంది. ఆ తర్వాత ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపించారు. ఈ కేసులో శివానిని విచారిస్తున్నామని ఏఎస్పీ వాజ్పేయి తెలిపారు. మార్చి 2023లో దీపక్ రైల్వేలో చేరాడు.
తాజావార్తలు
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
-
Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
-
Peddi : ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**
-
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?