Lalu Prasad Yadav: 2024 ఎన్నికల్లో బీజేపీని తుడిచిపెడతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నుంచి కోలుకుంటున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీని హెచ్చరించారు. శనివారం జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి మహాగటబంధన్ ర్యాలీని ఉద్దేశిస్తూ వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. బీజేపీ దేశాన్ని కులం, మతం పేరుతో విభజించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని మైనారిటీలకు వ్యతిరేకం అని, మేము 2024 లోక్ సభ, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తుడిచివేస్తాం అని అన్నారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నాయని, రాజ్యాంగాన్ని మార్చడానికి, రిజర్వేషన్లను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని లాలూ ఆరోపించారు. మా పోరాటం ఆర్ఎస్ఎస్ భావజాలంపై అని బీజేపీ దాని సూచనలను అనుసరిస్తోందని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో మొత్తం దేశం నుంచి తరిమికొడతామని అన్నారు.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
Read Also: Turkey Earthquake: టర్కీలో మరోసారి భూకంపం.. 5.3 తీవ్రత నమోదు..
తన ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడుతూ..నేను ఈ ర్యాలీకి హాజరు కావాలని కోరుకున్నప్పటికీ.. నా ఆరోగ్య పరిస్థితులు నన్ను అనుమతించలేదని, నేను బాగా కోలుకున్నానని, ప్రజల ప్రార్థనలకు ధన్యవాదాలు తెలిపారు. నాకు కిడ్నీని ఇచ్చిన నా కుమార్తె రోహిణి ఆచార్యకు ఎప్పుడూ రుణపడి ఉంటానని లాలూ అన్నారు.
ఇదిలా ఉంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ..కాంగ్రెస్ చేతులు కలిపితే ప్రతిపక్షాలన్నీ కలిసి 2024 ఎన్నికల్లో బీజేపీని 100 సీట్లకే పరిమితం చేయవచ్చని మరోసారి అన్నారు. బీజేపీని దేశం నుంచి తుడిచిపెట్టేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటానని ఆయన అన్నారు. దీనికి ముందు బీహర్ పర్యటనలో ఉన్న కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, జేడీయూ-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిని విమర్శించారు. తన ప్రధాని కలను నెరవేర్చుకోవడానికే నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ లతో చేతులు కలిపారని దుయ్యబట్టారు. బీహార్ లో మరోసారి జంగిల్ రాజ్ ను తీసుకుని వచ్చారని.. దీన్ని అంతమొందించాలంటే బీజేపీకి మెజారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
తాజావార్తలు
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!