Lalu Prasad Yadav: 2024 ఎన్నికల్లో బీజేపీని తుడిచిపెడతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నుంచి కోలుకుంటున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీని హెచ్చరించారు. శనివారం జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి మహాగటబంధన్ ర్యాలీని ఉద్దేశిస్తూ వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. బీజేపీ దేశాన్ని కులం, మతం పేరుతో విభజించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని మైనారిటీలకు వ్యతిరేకం అని, మేము 2024 లోక్ సభ, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తుడిచివేస్తాం అని అన్నారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నాయని, రాజ్యాంగాన్ని మార్చడానికి, రిజర్వేషన్లను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని లాలూ ఆరోపించారు. మా పోరాటం ఆర్ఎస్ఎస్ భావజాలంపై అని బీజేపీ దాని సూచనలను అనుసరిస్తోందని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో మొత్తం దేశం నుంచి తరిమికొడతామని అన్నారు.
Also Read
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
Read Also: Turkey Earthquake: టర్కీలో మరోసారి భూకంపం.. 5.3 తీవ్రత నమోదు..
తన ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడుతూ..నేను ఈ ర్యాలీకి హాజరు కావాలని కోరుకున్నప్పటికీ.. నా ఆరోగ్య పరిస్థితులు నన్ను అనుమతించలేదని, నేను బాగా కోలుకున్నానని, ప్రజల ప్రార్థనలకు ధన్యవాదాలు తెలిపారు. నాకు కిడ్నీని ఇచ్చిన నా కుమార్తె రోహిణి ఆచార్యకు ఎప్పుడూ రుణపడి ఉంటానని లాలూ అన్నారు.
ఇదిలా ఉంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ..కాంగ్రెస్ చేతులు కలిపితే ప్రతిపక్షాలన్నీ కలిసి 2024 ఎన్నికల్లో బీజేపీని 100 సీట్లకే పరిమితం చేయవచ్చని మరోసారి అన్నారు. బీజేపీని దేశం నుంచి తుడిచిపెట్టేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటానని ఆయన అన్నారు. దీనికి ముందు బీహర్ పర్యటనలో ఉన్న కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, జేడీయూ-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిని విమర్శించారు. తన ప్రధాని కలను నెరవేర్చుకోవడానికే నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ లతో చేతులు కలిపారని దుయ్యబట్టారు. బీహార్ లో మరోసారి జంగిల్ రాజ్ ను తీసుకుని వచ్చారని.. దీన్ని అంతమొందించాలంటే బీజేపీకి మెజారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
తాజావార్తలు
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!