Lalu Prasad Yadav: 2024 ఎన్నికల్లో బీజేపీని తుడిచిపెడతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నుంచి కోలుకుంటున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీని హెచ్చరించారు. శనివారం జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి మహాగటబంధన్ ర్యాలీని ఉద్దేశిస్తూ వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. బీజేపీ దేశాన్ని కులం, మతం పేరుతో విభజించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని మైనారిటీలకు వ్యతిరేకం అని, మేము 2024 లోక్ సభ, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తుడిచివేస్తాం అని అన్నారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నాయని, రాజ్యాంగాన్ని మార్చడానికి, రిజర్వేషన్లను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని లాలూ ఆరోపించారు. మా పోరాటం ఆర్ఎస్ఎస్ భావజాలంపై అని బీజేపీ దాని సూచనలను అనుసరిస్తోందని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో మొత్తం దేశం నుంచి తరిమికొడతామని అన్నారు.
Also Read
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
Read Also: Turkey Earthquake: టర్కీలో మరోసారి భూకంపం.. 5.3 తీవ్రత నమోదు..
తన ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడుతూ..నేను ఈ ర్యాలీకి హాజరు కావాలని కోరుకున్నప్పటికీ.. నా ఆరోగ్య పరిస్థితులు నన్ను అనుమతించలేదని, నేను బాగా కోలుకున్నానని, ప్రజల ప్రార్థనలకు ధన్యవాదాలు తెలిపారు. నాకు కిడ్నీని ఇచ్చిన నా కుమార్తె రోహిణి ఆచార్యకు ఎప్పుడూ రుణపడి ఉంటానని లాలూ అన్నారు.
ఇదిలా ఉంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ..కాంగ్రెస్ చేతులు కలిపితే ప్రతిపక్షాలన్నీ కలిసి 2024 ఎన్నికల్లో బీజేపీని 100 సీట్లకే పరిమితం చేయవచ్చని మరోసారి అన్నారు. బీజేపీని దేశం నుంచి తుడిచిపెట్టేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటానని ఆయన అన్నారు. దీనికి ముందు బీహర్ పర్యటనలో ఉన్న కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, జేడీయూ-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిని విమర్శించారు. తన ప్రధాని కలను నెరవేర్చుకోవడానికే నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ లతో చేతులు కలిపారని దుయ్యబట్టారు. బీహార్ లో మరోసారి జంగిల్ రాజ్ ను తీసుకుని వచ్చారని.. దీన్ని అంతమొందించాలంటే బీజేపీకి మెజారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
తాజావార్తలు
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!