Rekha Gupta: ఆ భవనాన్ని మ్యూజియంగా మారుస్తాం..
- శీష్ మహల్ ను మ్యూజియంగా మారుస్తాం..
- సీఎం పదవికి నన్న ఎంపిక చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు..
- ప్రధాని మోడీ ఇచ్చిన అన్ని హామీలను త్వరలో నెరవేరుస్తాం: రేఖాగుప్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rekha Gupta: అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీలో శీష్ మహల్ పేరు బాగా వినిపించింది. ఇప్పుడు ఆ భవనాన్ని మ్యూజియంగా మారుస్తామని ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే నెరవేరుస్తాం.. అలాగే, ఈ పదవికి నన్ను ఎంపిక చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పని చేసినప్పుడు సివిల్ లైన్స్లో 6 ఫ్లాగ్స్టాఫ్ రోడ్ బంగ్లాను అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 7 స్టార్ రిసార్టుగా మార్చుకున్నారని బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించామని.. తానేమీ అద్దాల మేడ కట్టుకోలేదని ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ ను నరేంద్ర మోడీ విమర్శించారు.
Read Also: Shivangi : అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘శివంగి’ ఫస్ట్ లుక్ రిలీజ్
Also Read
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
అయితే, ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేటప్పుడు ముఖ్యమంత్రిని అవుతానని నాకు తెలియదు అని రేఖా గుప్తా ప్రకటించారు. 48 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికి వెళ్లా.. కానీ పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ నా పేరు ప్రతిపాదించిన తర్వాతే తెలిసిందని ఆమె చెప్పారు. మార్చి 8వ నాటికి ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 అందజేస్తామని వెల్లడించింది.
Read Also: Trump vs INDIA: భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే అమెరికా నష్టపోతుంది..
అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ మోసాలకు ఆ శీష్ మహల్ ఓ ఉదాహరణ అనే ప్రచారాన్ని బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఆప్ సర్కార్ పై వచ్చిన ఈ అవినీతి ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతిసి.. బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టింది. ఇక, మరోసారి విమర్శలకు తావులేకుండా ఆ బంగ్లాకు దూరంగా ఉండాలని కమలం పార్టీ యోచిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఢిల్లీకి కొత్తగా వచ్చే ముఖ్యమంత్రి అందులో ఉండకపోవచ్చని ప్రచారం జరిగింది. వాటికి తగ్గట్టే రేఖా గుప్తా పై విధంగా స్పందించింది. ఇదిలాఉంటే.. ఈరోజు రామ్లీలా మైదానంలో ప్రజల సమక్షంలో రేఖా గుప్తా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతో పాటు ఎన్డీయే పక్ష సీఎంలు, ఎంపీలు హాజరుకానున్నారు.
తాజావార్తలు
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?