Kangana Ranaut: రాజకీయ నేతలు పానీపూరి అమ్ముకోవాలా..? శంకరాచార్య వ్యాఖ్యలపై కంగనా ఫైర్..
- ఏక్నాథ్ షిండేపై శంకరాచార్య ‘ద్రోహం’ విమర్శలు..
- షిండేకు మద్దతు తెలిపిన కంగనా రనౌత్..
- రాజకీయ నాయకులు పానీపూరీ అమ్ముకోవాలా అంటూ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: జ్యోతిర్మఠ్ శంకరాచార్యులు అవిముక్తేశ్వరానందర సరస్వతి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు. ఏక్నాథ్ షిండేకి మద్దతుగా నిలబడ్డారు. శివసేన(యూబీటీ)నేత ఉద్ధవ్ ఠాక్రేకి, ఏక్ నాథ్ షిండే ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. హిందూ మత సిద్ధాంతాల్లో ద్రోహాన్ని అతిపెద్ద పాపంగా పరిగణిస్తారని, ద్రోహం చేసేవారు ఎప్పటికీ హిందువులు కాలేదరని ఆయన అన్నారు. సీఎం పదవి నుంచి ఉద్ధవ్ ఠాక్రేని దించడాన్ని ఆయన ప్రస్తావించారు.
Read Also: Gudivada Amarnath: రాష్ట్రంలో దాడులు, హత్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలి..
Also Read
- Iran invites PM Modi: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకండి.. మోడీకి ఇరాన్ ఆహ్వానం..
- India Iran Travel Advisory: ఇరాన్కు అనవసర ప్రయాణాలు వద్దు.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
- Ketan Agarwal Murder Case: అప్పుడు ‘సోనమ్’.. ఇప్పుడు ‘సియా’.. పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు..
- Delhi: తెల్లవారుజామున కలకలం.. కార్మికుల గుడిసెల్లో భారీ అగ్నిప్రమాదం.!
ఉద్ధవ్ ఠాక్రేకి జరిగిన ద్రోహం గురించి ప్రజలు బాధపడుతున్నారని, ఆయన మళ్లీ సీఎం అయ్యే వరకు వారి బాధ తీరదని అవిముక్తేశ్వరానంద అన్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ విషయం రుజువైందని చెప్పారు. ‘‘ద్రోహాన్ని సహించలేము. ప్రభుత్వాన్ని మధ్యలో కూల్చేయడం, ప్రజాతీర్పును అవమానించడం ఆమోదయోగ్యం కాదు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు, కానీ హిందూ మతం అలాంటి ద్రోహాన్ని అంగీకరించదు’’ అని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 ఎంపీ స్థానాల్లో బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్)ల మహాయుతి కూటమి 17 సీట్లను మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్-శివసేన(ఠాక్రే)-ఎన్సీపీ(శరద్ పవార్)ల మహా వికాస్ అఘాడీ 30 స్థానాలను కైవసం చేసుకుంది.
అయితే, ఆయన వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఘాటుగానే స్పందించారు. ఒక రాజకీయ నాయకుడు రాజకీయాలు చేయకుంటే గోల్గప్ప(పానీ పూరి) అమ్ముతాడా..? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో పొత్తులు, ఒప్పందాలు, పార్టీల విభజన చాలా సాధారణం, రాజ్యాంగబద్ధమైనందని ఆమె అన్నారు. శంకరాచార్య జీ తన పదాలను, ప్రభావాన్ని, మతపరమైన విద్యను దుర్వినియోగం చేశారని అన్నారు. ‘‘ రాజు స్వయంగా తన ప్రజలను దోపిడీ చేయడం దేశద్రోహమే అని మతం చెబుతుంది’’ అని ఆమె అన్నారు. ఏక్నాథ్ షిండేను ద్రోహిగా పేర్కొని మనందరి మనోభావాలను శంకరాచార్య దెబ్బతీశారని అన్నారు. శంకరాచార్య జీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి హిందూ మతం గౌరవాన్ని కించపరుస్తున్నారని విమర్శించారు.
తాజావార్తలు
-
Ayush Singh: డిగ్రీ లేదు.. ఉద్యోగం లేదు.. కానీ ఏఐ (AI) తో నెలకు రూ.కోటి సంపాదన! ఎలాగో తెలుసా?
-
Iran invites PM Modi: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకండి.. మోడీకి ఇరాన్ ఆహ్వానం..
-
Italy: ఇటలీ రెస్టారెంట్లో భారతీయులపై బంగ్లాదేశ్ వెయిటర్ జాత్యహంకార వ్యాఖ్యలు
-
LIG Housing Scheme: లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు పెట్టండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి.!
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
ట్రెండింగ్
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!