Gudivada Amarnath: రాష్ట్రంలో దాడులు, హత్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలి..
- కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు.. హత్యలు పెరిగాయి..
- వెంటనే దాడులు.. హత్యలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి..
- రేపు రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు: అమర్నాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దాడులు, హత్యలపై ముందుగా శ్వేతపత్రం విడుదల చేయ్యాలని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోంది.. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయ్యింది.. శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రభుత్వం విఫలం అయ్యింది అని మండిపడ్డారు. బెదిరిచాలి, భయ పెట్టాలి, ప్రాణాలు తీయ్యాలి అనే ధోరణిలోనే దాడులు జరుగుతున్నాయి.. బయటకు వెళితే క్షేమంగా ఇంటికి వస్తామనే నమ్మకం ప్రజల్లో పోయింది.. వినుకొండలో బహిరంగంగా వైసీపీ మైనార్టీ నాయకుడు హత్యను రాష్ట్ర ప్రజలు అందరు ప్రత్యక్షంగా చూశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: PM Modi: ప్రధాని మోడీ టార్గెట్గా కాంగ్రెస్ హింసను ప్రేరేపిస్తోంది..
Also Read
బాధిత కుటుంబాన్ని రేపు జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి, వాహనాల ధ్వంసం ప్రజాస్వామ్యంలో ఎంత వరకు సమంజసమో ప్రజలే చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఈ తరహా దాడులు చేస్తామని కూటమి నాయకులు ముందే హెచ్చరికలు చేశారు.. మనుషుల్ని చంపుతూ క్రికెట్ మ్యాచ్ చూపించినట్టు లైవ్ లో చూపిస్తున్నారు.. వైసీపీ కేడర్ ను భయ భ్రాంతులను గురి చేసే ప్రయత్నంలోనే భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి. ఎన్ని బెదిరింపులు ఎదురైన వైసీపీ నాయకత్వం వెనక్కి తగ్గేది లేదు.. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరతామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: మోహన్లాల్ను తాతగా మార్చిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
-
NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
-
NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
-
ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..