Gudivada Amarnath: రాష్ట్రంలో దాడులు, హత్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలి..
- కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు.. హత్యలు పెరిగాయి..
- వెంటనే దాడులు.. హత్యలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి..
- రేపు రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు: అమర్నాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దాడులు, హత్యలపై ముందుగా శ్వేతపత్రం విడుదల చేయ్యాలని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోంది.. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయ్యింది.. శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రభుత్వం విఫలం అయ్యింది అని మండిపడ్డారు. బెదిరిచాలి, భయ పెట్టాలి, ప్రాణాలు తీయ్యాలి అనే ధోరణిలోనే దాడులు జరుగుతున్నాయి.. బయటకు వెళితే క్షేమంగా ఇంటికి వస్తామనే నమ్మకం ప్రజల్లో పోయింది.. వినుకొండలో బహిరంగంగా వైసీపీ మైనార్టీ నాయకుడు హత్యను రాష్ట్ర ప్రజలు అందరు ప్రత్యక్షంగా చూశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: PM Modi: ప్రధాని మోడీ టార్గెట్గా కాంగ్రెస్ హింసను ప్రేరేపిస్తోంది..
Also Read
బాధిత కుటుంబాన్ని రేపు జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి, వాహనాల ధ్వంసం ప్రజాస్వామ్యంలో ఎంత వరకు సమంజసమో ప్రజలే చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఈ తరహా దాడులు చేస్తామని కూటమి నాయకులు ముందే హెచ్చరికలు చేశారు.. మనుషుల్ని చంపుతూ క్రికెట్ మ్యాచ్ చూపించినట్టు లైవ్ లో చూపిస్తున్నారు.. వైసీపీ కేడర్ ను భయ భ్రాంతులను గురి చేసే ప్రయత్నంలోనే భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి. ఎన్ని బెదిరింపులు ఎదురైన వైసీపీ నాయకత్వం వెనక్కి తగ్గేది లేదు.. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరతామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!