High Court: మగ స్నేహితుడితో భార్య అసభ్యకరమైన చాటింగ్.. భర్త సహించలేడన్న హైకోర్ట్..
- మగ స్నేహితుడితో భార్య అసభ్యకరమైన చాటింగ్..
- అలాంటివి భర్త సహించలేడన్న హైకోర్టు..
- విడాకులు ఇస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: పెళ్లి తర్వాత పురుషుడు లేదా స్త్రీ తమ స్నేహితులతో ‘‘అసభ్యకకరమైన’’ సంభాషణల్లో పాల్గొనకూడదని, ఏ భర్త తన భార్య నుంచి అలాంటి చాటింగ్ని సహించలేడని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. విడాకులకు అనుమతి ఇస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ని కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భర్తపై భార్య క్రూరత్వం కారణంగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఫ్యామిలీ కోర్టు తీర్పును హైకోర్టు న్యాయమూర్తులు వివేక్ రొసియా, జస్టిస్ గజేంద్ర సింగ్లతో కూడిన ధర్మాసనం సమర్థించింది.
సదరు మహిళ తన మగ స్నేహితుడితో తన లైంగిక జీవితం గురించి చాట్ చేస్తున్నట్లు కోర్టు గమనించింది. అలాంటి ప్రవర్తన గురించి ఏ భర్త కూడా సహించడని కోర్టు పేర్కొంది. ‘‘తన భార్య మొబైల్ ద్వారా ఈ రకమైన అసభ్యకరమైన సంభాషణలో ఉండటం ఏ భర్త సహించడు’’ అని చెప్పింది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Breaking News: పాకిస్తాన్లో మరో దాడి.. మసీదులో బాంబ్ బ్లాస్ట్..
‘‘వివాహం తర్వాత, భార్యాభర్తలు ఇద్దరూ మొబైల్, చాటింగ్ మరియు ఇతర మార్గాల ద్వారా స్నేహితులతో సంభాషించే స్వేచ్ఛను కలిగి ఉంటారు, కానీ సంభాషణ స్థాయి మర్యాదగా, గౌరవంగా ఉండాలి, ముఖ్యంగా ఆపోజిట్ జెండర్ చెందిన వారితో ఉన్నప్పుడు అభ్యంతరకరంగా ఉండొద్దు’’ అని కోర్టు చెప్పింది. ఒక జీవిత భాగస్వామిపై మరొకరికి అభ్యంతరం ఉన్నప్పటికీ అలాంటి కార్యకలాపాలను కొనసాగిస్తే అది నిస్సందేహంగా మానసిక క్రూరత్వం కిందకు వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
ఈ జంట 2018లో ప్రేమ వివాహం చేసుకుంది. భర్త ఫిర్యాదు ప్రకారం, ఆ మహిళ వివాహం తర్వాత తన ‘‘పాత ప్రేమికుల’’తో మొబైల్లో మాట్లాడేది. వాట్సాప్ సంభాషణలు అసభ్యకరంగా ఉన్నాయని ఆమె భర్త ఆరోపించాడు. దీంతో తనకు సంబంధం లేదని భార్య, భర్త వాదనల్ని తోసిపుచ్చింది. తన భర్త తన మొబైల్ని హ్యాక్ చేసి, తనకు వ్యతిరేకంగా ఆధారాలు సృష్టించడానికి ఆ సందేశాలను ఇద్దరు పురుషులకు పంపాడని కూడా ఆమె పేర్కొంది. తన భర్త చర్యలు తన గోప్యతా హక్కుని ఉల్లంఘించాయని ఆ మహిళ ఆరోపించింది. ఆమె అతడిపై రూ.25 లక్షల కట్నం డిమాండ్ ఆరోపణలు చేసింది. అయితే, భర్త ఆరోపణల్లో అర్హత ఉందని కోర్టు గుర్తించింది. మహిళ తండ్రి కూడా తన కుమార్తె తన బాయ్ఫ్రెండ్తో మాట్లాడేదని సాక్ష్యమిచ్చాడు. దీంతో దిగువ కోర్టు మంజూరు చేసిన విడాకుల్ని, హైకోర్టు సమర్థించింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!