Waqf: ‘‘ముస్లింలు నమాజ్ చేసే ఏ స్థలమైనా వక్ఫ్ ప్రావర్టీనే’’.. తృణమూల్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.
- ముస్లింలు నమాజ్ చేసే ప్రతీ చోటు వక్ఫ్ ప్రాపర్టీనే..
- తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ కామెంట్స్..
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf: కేంద్ర వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువస్తోంది. ఇప్పటికే దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పార్లమెంట్ ఉభయసభలకు చెందిన అధికార, ప్రతిపక్ష ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే కమిటీ తన రిపోర్టుని పార్లమెంట్కి సమర్పించాల్సి ఉన్నా, కమిటీ కాల పరిమితిని వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలకు పెంచారు. వక్ఫ్ బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలను కట్టడి చేయనున్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఇది మతస్వేచ్ఛని దెబ్బతీయడమే అంటూ కామెంట్స్ చేస్తున్నాయి.
Read Also: Maharashtra: కేంద్ర పరిశీలకులుగా నిరలమ్మ, విజయ్ రూపానీ! షిండే కుమారుడికి కీలక పదవి?
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ఇదిలా ఉంటే, తాజాగా మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘ముస్లింలు నమాజ్ చేసే ఏ ప్రదేశమైనా ఆటోమేటిక్గా వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడుతుంది.’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఆయన వ్యాఖ్యల ప్రకారం.. నమాజ్ కోసం ఉపయోగించే రోడ్డు, రైల్వే ట్రాక్స్, విమానావ్రయాలు, పార్కులు, ఇతర ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేయవచ్చని సూచిస్తున్నాయని, కొల్కతాలో ముఖ్యమైన ప్రాంతాలతో సహా పెద్ద మొత్తంలో భూములు ముస్లిం సమాజానికి బదిలీ చేయబడుతున్నాయని బీజేపీ ఆరోపించింది.
ఓట్ల కోసం ఇలాంటివి ప్రోత్సహించినట్లైతే బెంగాలీ హిందూ సమాజం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని, వారి స్వస్థలమైన పశ్చిమ బెంగాల్ విడిచివేళ్లే ప్రమాదం ఉందని, పాకిస్తాన్-బంగ్లాదేశ్ వలే బెంగాల్లో హిందువులు పూర్తిగా నిర్మూలించేలా టీఎంసీ, మమతా బెనర్జీ చర్యలు చేపడుతున్నారని బీజేపీ నేత అమిత్ మాల్వియా ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లుని వ్యతిరేకిస్తూ టీఎంసీ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిందని, కళ్యాణ్ బెనర్జీ ఇష్టానుసారంగా మాట్లాడటం లేదని, ఆయన మమతా ఉద్దేశాలనే చెబుతున్నాడని మాల్వియా ఆరోపించారు.
Yesterday, TMC MP Kalyan Banerjee, also a member of the Parliament Committee on Waqf, announced that any place where Muslims offer Namaz would automatically be considered a Waqf property.
Today, TMC Govt is bringing in a Bill in the State Assembly to oppose the Waqf Amendments.… https://t.co/QZB5DGvBZY
— Amit Malviya (@amitmalviya) December 2, 2024
తాజావార్తలు
-
Ola S1Z: భారత్లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
-
AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. మిర్జా రహమత్ బేగ్పై ఎంఐఎం వేటు..
-
Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
-
CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
-
Saturday Horoscope: ఆగస్టు 29 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్న్యూస్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!