Shimla Mosque Row: మసీదుని కూలిస్తే బీజేపీకి, కాంగ్రెస్కి తేడా ఏంటి..? కాంగ్రెస్పై సొంత పార్టీ నేత..
- హిమాచల్ ప్రదేశ్లో వివాదంగా మారిన మసీదు నిర్మాణం..
- నిర్మాణాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రి..
- మసీదు కూలిస్తే బీజేపీకి
- కాంగ్రెస్కి తేడా ఏంటన్న రషీద్ అల్వీ..
Shimla Mosque Row: హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను సిమ్లా మసీదు నిర్మాణం కుదిపేస్తోంది. అక్రమంగా ఈ మసీదును నిర్మిస్తున్నారని అధికార కాంగ్రెస్కి చెందిన మంత్రి అనిరుద్ధ్ సింగ్ ఏకంగా అసెంబ్లీలో వ్యాఖ్యానించడం రచ్చకు కారణమైంది. ఇంతే కాకుండా మసీదు ఉన్న ఏరియాలో దొంగతనాలు, లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయన్న మంత్రి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. నిన్న పెద్ద ఎత్తున ప్రజలు, హిందూ సంస్థలు, బీజేపీ ఆందోళన నిర్వహించింది.
Read Also: Drunk Man Dial 100: ఫుల్లుగా తాగి డయల్ 100కి ఫోన్ చేస్తున్న వ్యక్తికి జైలు శిక్ష
Also Read
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
- IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఇదిలా ఉంటే, మసీదు నిర్మాణం రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీలోనే నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఈ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రషీద్ అల్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మసీదును కూల్చివేస్తే బీజేపీకి, కాంగ్రెస్కి తేడా ఏమిటని ఆయన ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా నిర్మించిన సంజౌలి మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్న వారిపై కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు.
మసీదు ఉన్న స్థలం వక్ఫ్ బోర్డుకు చెందినదని, ప్రభుత్వంలోని ఒక మంత్రి కూడా అది వక్ఫ్ బోర్డు స్థలమే అని చెప్పడాన్ని రషీద్ అల్వీ ప్రస్తావించారు. ఇది పాత మసీదు, దీనిని కూల్చివేసే ప్రశ్నే లేదని చెప్పారు. అంతకుముందు సభలో మాట్లాడిన మంత్రి అనిరుద్ధ్ సింగ్ , సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నించారు. వారు అనుమతి లేకుండా నిర్మాణాన్ని ప్రారంభించారని చెప్పారు. మసీదుని తెరవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి కోరారా..? అని అడిగారు. సమస్యపై విచారణ జరిపిస్తున్నామని, ఆందోళనకారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని హెచ్చరించారు.
తాజావార్తలు
-
MI vs SRH: వాంఖడే చరిత్రలోనే ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. కన్నీరు పెట్టిన నీతా అంబానీ!
-
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
-
Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!