Shimla Mosque Row: మసీదుని కూలిస్తే బీజేపీకి, కాంగ్రెస్కి తేడా ఏంటి..? కాంగ్రెస్పై సొంత పార్టీ నేత..
- హిమాచల్ ప్రదేశ్లో వివాదంగా మారిన మసీదు నిర్మాణం..
- నిర్మాణాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రి..
- మసీదు కూలిస్తే బీజేపీకి
- కాంగ్రెస్కి తేడా ఏంటన్న రషీద్ అల్వీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shimla Mosque Row: హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను సిమ్లా మసీదు నిర్మాణం కుదిపేస్తోంది. అక్రమంగా ఈ మసీదును నిర్మిస్తున్నారని అధికార కాంగ్రెస్కి చెందిన మంత్రి అనిరుద్ధ్ సింగ్ ఏకంగా అసెంబ్లీలో వ్యాఖ్యానించడం రచ్చకు కారణమైంది. ఇంతే కాకుండా మసీదు ఉన్న ఏరియాలో దొంగతనాలు, లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయన్న మంత్రి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. నిన్న పెద్ద ఎత్తున ప్రజలు, హిందూ సంస్థలు, బీజేపీ ఆందోళన నిర్వహించింది.
Read Also: Drunk Man Dial 100: ఫుల్లుగా తాగి డయల్ 100కి ఫోన్ చేస్తున్న వ్యక్తికి జైలు శిక్ష
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
ఇదిలా ఉంటే, మసీదు నిర్మాణం రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీలోనే నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఈ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రషీద్ అల్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మసీదును కూల్చివేస్తే బీజేపీకి, కాంగ్రెస్కి తేడా ఏమిటని ఆయన ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా నిర్మించిన సంజౌలి మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్న వారిపై కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు.
మసీదు ఉన్న స్థలం వక్ఫ్ బోర్డుకు చెందినదని, ప్రభుత్వంలోని ఒక మంత్రి కూడా అది వక్ఫ్ బోర్డు స్థలమే అని చెప్పడాన్ని రషీద్ అల్వీ ప్రస్తావించారు. ఇది పాత మసీదు, దీనిని కూల్చివేసే ప్రశ్నే లేదని చెప్పారు. అంతకుముందు సభలో మాట్లాడిన మంత్రి అనిరుద్ధ్ సింగ్ , సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నించారు. వారు అనుమతి లేకుండా నిర్మాణాన్ని ప్రారంభించారని చెప్పారు. మసీదుని తెరవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి కోరారా..? అని అడిగారు. సమస్యపై విచారణ జరిపిస్తున్నామని, ఆందోళనకారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!