Yogi Adityanath: ‘‘మసీదుల్ని స్వాధీనం చేసుకుని బీజేపీ ఏం చేస్తుంది’’.. యోగి సమాధానం ఇదే..
- వక్ఫ్ బిల్లుపై స్పందించిన సీఎం యోగి..
- వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడం బీజేపీ పని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: మసీదులు, వక్ఫ్ ఆస్తులకు సంబంధించి బీజేపీ చేస్తున్న పనులపై ప్రతిపక్షాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. వక్ఫ్ పేరుతో వారు ఎంత భూమిని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నారు..? వారు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు..? అని ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తుల్ని వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేశారని, కొన్ని ఆస్తుల్ని వేరే వ్యక్తులకు విక్రయించడంతో ఇది వివాదానికి దారి తీస్తోందని అన్నారు.
Read Also: Kubera: ‘కుబేర’ ముగించిన నాగార్జున.. మరో స్లమ్ డాగ్ మిలియనీర్!
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
మసీదుల్ని స్వాధీనం చేసుకుని బీజేపీ ఏం చేస్తుంది… ప్రతిపక్షాలు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని యోగి విమర్శించారు. వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమణలు, దుర్వినియోగం నుంచి విముక్తి చేయడం, సమాజ సంక్షేమం కోసం వాటిని ఉపయోగించుకోవడమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, దేశ ప్రయోజనాలకు ముస్లిం సమాజానికి ఇది చాలా అవసరమని చెప్పారు. ఈ బిల్లు ద్వారా ఆస్తులపై స్థిరపడిన వారికి, వక్ఫ్ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు సమస్యలు తప్పవని యోగి హెచ్చరించారు.
ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేయడానికి వక్ఫ్ బోర్డు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసిందని యోగి ఆరోపించారు. భూమి సేకరించడానికి వక్ఫ్ బోర్డుకు ఉన్న అధికారాన్ని ఆయన ప్రశ్నించారు. వారు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారని, ఆస్తులు, ప్రభుత్వ భూములను ఎలాంటి ఆధారాలు లేకుండా స్వాధీనం చేసుకున్నారని అన్నారు. వేరే భూమిని తీసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చారు.?? అని ప్రశ్నించారు. ఇది భవిష్యత్తులో జరగదని యోగి చెప్పారు.
తాజావార్తలు
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!