Mohan Bhagwat: ASL భద్రత అంటే ఏమిటి.? ఆర్ఎస్ఎస్ చీఫ్కి అమిత్ షాతో సమానంగా భద్రత పెంపు..
- అమిత్ షాకి సమానంగా ఆర్ఎస్ఎస్ చీఫ్కి భద్రత పెంపు..
- జెడ్ ప్లస్ నుంచి ఏఎస్ఎల్ భద్రత..
- దేశంలో కొందరికి మాత్రమే ఇలాంటి సెక్యూరిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Bhagwat: బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్కి కేంద్రం భద్రతను పటిష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ‘‘జెడ్-ప్లస్’’ కేటగిరి నుంచి మరింత పటిష్టమైన అధునాతన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తూ ఏఎస్ఎల్ ప్రోటోకాల్కి భద్రతను పెంచారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి సమానంగా భగవత్కి భద్రతను అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బంది మోహన్ భగవత్కి భద్రతను అందిస్తోంది.
ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు పాలించే రాష్ట్రాల్లో ‘‘ప్రెష్ రిస్క్ అసెస్మెంట్’’ అంచనాల తర్వాత ఈ కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. రాడికల్ ఇస్లామిక్ గ్రూపులతో సహా వివిధ సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్ భగవత్తో పాటు దేశంలోని 10 మంది వ్యక్తులకు మాత్రమే జెడ్-ప్లస్ కేటగిరి భద్రత ఉంది. ఇప్పుడు దానిని ఏఎస్ఎల్ భద్రతకు పెంచారు.
Also Read
- Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
- Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
- Ratna Debnath: 'నేను నా కూతురిని కోల్పోయా.. ఆమె తన కుర్చీని కోల్పోయింది'.. మమతపై ఆర్జీ కార్ బాధితురాలి తల్లి విమర్శలు
- K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
Read Also: Puja Khedkar: “నా అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అధికారం యూపీఎస్సీకి లేదు”
ASL భద్రత అంటే ఏమిటి..?
అడ్వాన్సుడ్ సెక్యూరిటీ లైజన్(ఏఎస్ఎల్) కింద జిల్లా పరిపాలన, పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన ఇతర డిపార్ట్మెంట్ల వంటి స్థానిక ఏజెన్సీలు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ఈ వ్యూహంలో మల్టీ లేయర్ సెక్యూరిటీ వయలం, కఠినమైన విధ్వంసక చర్యల్ని ఎదుర్కొనేందుకు సెక్యూరిటీ ఉంటుంది. నేతల పర్యటనలకు సంబంధించి ముందస్తు రివ్యూలు, సమీక్షలు, రిహార్సల్స్ ఉంటాయి. స్థానిక పోలీసులతో సన్నిహిత సమన్వయంతో పాటు విధ్వంసక నిరోధక తనిఖీలు చేస్తారు. వేదికలను ముందే ఎలాంటి ప్రమాదాలు లేకుండా శానిటైజ్ చేస్తుంది. ఏఎస్ఎల్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రధాని నరేంద్రమోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, గాంధీ కుటుంబ నేతలకు ఉంది.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?