Prisoners: ఖైదీలకు దసరా గుడ్న్యూస్.. 4 రోజులు లంచ్.. డిన్నర్లో మటన్, చికెన్ బిర్యానీలు
- ఖైదీలకు దసరా గుడ్న్యూస్
- 4 రోజులు లంచ్.. డిన్నర్లో మటన్.. చికెన్ బిర్యానీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్షణికావేశంలో చేసిన తప్పులు కారణంగా వారంతా జైల్లో మగ్గుతున్నారు. రక్త సంబంధాలకు దూరంగా నాలుగు గోడల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. వారికి ఓ పండుగ ఉండదు. ఓ ఆనందం ఉండదు. అక్కడే తింటూ.. ఆ నలుగురితోనే ఉంటూ ధీనమైన బతుకును జీవిస్తుంటారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఒక ఆందోళనకరమైన జీవితాన్ని జీవిస్తున్న ఖైదీల కోసం పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. ఖైదీల్లో సరికొత్త మార్పు తీసుకొచ్చేందుకు దసరా పండుగ సందర్భంగా దుర్గాపూజ జరిగే సమయంలో సరికొత్త మెనూ అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
దుర్గాపూజ వేడుకల సమయంలో ఖైదీలకు రుచికరమైన భోజనాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లంచ్, డిన్నర్ సమయంలో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, బసంతి పులావ్, మాచెర్ మాతా దియే పుయ్ షాక్ (చేప తలతో కూడిన మలబార్ బచ్చలికూర) మరియు మాచెర్ మాతా దియే దాల్ (చేప తలతో పప్పు) తో వడ్డించనున్నారు. ఖైదీలు పండుగ సంతోషాన్ని కోల్పోతున్నామన్న బాధ కలుగకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త మెనూ అక్టోబర్ 9 నుంచి 12 వరకు అందించనున్నారు. ఈ ఆహార పదార్థాలన్నీ ఖైదీల చేతనే తయారు చేయించనున్నారు. ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం అధికారి వెల్లడించారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ఈ కొత్త మెనూ ఖైదీలతో పాటు రిమాండ్ ఖైదీలకు కూడా అందించనున్నారు. లంచ్, డిన్నర్ సమయంలో షష్టి నుంచి దశమి వరకు అమల్లో ఉంటుందని అధికారి తెలిపారు. దుర్గాపూజ ప్రారంభం నుంచి ముగింపు వరకు చక్కని ఆహారాన్ని అందిస్తామని వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఖైదీలకు దసరా పండుగ సందర్భంగా మంచి ఆహారం అందిస్తామని.. ఈసారి ఖైదీల కోరిక మేరకు ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేవలం వారి ముఖాల్లో చిరునవ్వు తెచ్చేందుకే ఈ ప్రయత్నమని చెప్పుకొచ్చారు. ఇలాంటి కార్యక్రమాలతో ఖైదీల వ్యక్తిగత జీవితాల్లో మంచి మార్పు వస్తుందని భావిస్తున్నట్లు అధికారి తెలిపారు. ఈ రుచికరమైన వంటకాలన్నీ ఖైదీలే తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు.
వైరటీలు ఇవే..
మాచర్ మాతా దియే పుయ్ షక్, మాచెర్ మాతా దియే దాల్, లూచీ-చోలార్ దాల్, పాయేష్, చికెన్ కర్రీ, ఆలు. పొటోల్ చింగ్రీ, మటన్ బిర్యానీ విత్ రైతా మరియు బసంతి పులావ్ ఉండనున్నాయి. మొత్తానికి బెంగాల్లో ఫేమస్ అయిన వంటకాలన్నీ ఖైదీలు రుచి చూడనున్నారు. ఇదిలా ఉంటే ఖైదీలకు బలవంతంగా ఆహారాన్ని అందించబోమన్నారు. ఎవరి మతాచారాల ప్రకారం నచ్చిన ఆహారాన్ని మాత్రమే అందిస్తామని అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!