Bengaluru Murder Case: “మహాలక్ష్మీతో విసిగిపోయాను”.. నిందితుడి సూసైడ్ నోట్లో సంచలన విషయాలు..
- మహాలక్ష్మీ హత్యలో సంచలన విషయాలు..
- ఇప్పటికే నిందితుడు ముక్తి రంజన్ ఆత్మహత్య..
- సూసైడ్ నోట్లో తానే చంపానని చెప్పిన నిందితుడు..
- మహాలక్ష్మీతో విసిగిపోయే ఈ హత్య చేశాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Murder Case: బెంగళూర్ మహాలక్ష్మీ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహాలక్ష్మీని చంపేసి 59 ముక్కలుగా చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఒడిశాకు చెందిన ముక్తి రంజన్ రాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయేందుకు ముందు అతను సూసైడ్ నోట్ రాశాడు. దీంట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘సెప్టెంబర్ 03న తన లవర్ మహాలక్ష్మీని చంపాను’’ అని లేఖలో పేర్కొన్నాడు. ఆమె ఇంటికి వెళ్లి హత్య చేసినట్లు చెప్పాడు. ‘‘ నేను ఆమె ప్రవర్తనతో విసిగిపోయాను. నేను ఆమెతో వ్యక్తిగత విషయాలపై గొడవపడగా, మహాలక్ష్మీ నాపై దాడి చేసింది. కోపంతో ఆమెను చంపాను’’అని లేఖలో పేర్కొన్నాడు.
Read Also: Emergency Movie: కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ విడుదలకు మార్గం సుగమం.. కొన్ని సీన్స్ కట్
Also Read
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
- NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
‘‘మహాలక్ష్మీని చంపి, ఆమె శరీరాన్ని 59 ముక్కలు చేసి ఫ్రిజ్లో ఉంచాను. ఆమె ప్రవర్తనతో విసిగిపోయి ఈ పనిచేశాను’ అని తన డైరీలో పేర్కొన్నాడు. ఒడిశా భద్రక్ జిల్లాకు చెందిన రాయ్ బుధవారం తన సొంతూరుకి సమీపంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయ్ బుధవారం పాండి గ్రామానికి వచ్చి, ఇంట్లోని స్కూటర్ తీసుకుని బయటకు వెళ్లాడు, ఆ తర్వాత ఉరేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు.
సంచనంగా మారిన ఈ కేసులో ముక్తి రంజన్ని పట్టుకునేందుకు నాలుగు పోలీస్ బృందాలు ఒడిశాకు వెళ్లాయి. అనుమానిత వ్యక్తి సెప్టెంబర్ 1 నుంచి పనికి రావడం మానేశాడు. మహాలక్ష్మీ కూడా సెప్టెంబర్ 1 నుంచి పనికిరావడం లేదు. సెప్టెంబర్ 2-3 మధ్య మహాలక్ష్మీ హత్య జరిగినట్లు తేలింది. మహాలక్ష్మీ పనిచేస్తున్న చోట టీమ్ లీడ్గా నిందితుడు పనిచేస్తున్నాడు. మహాలక్ష్మీ, ముక్తి ఇద్దరూ ఓ గార్మెంట్ షాపులో పనిచేస్తున్నారు, ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. సెప్టెంబర్ 2న ఆమె వీకాఫ్ తీసుకుంది. ఎప్పటిలాగే ముక్తి రంజన్ రాయ్ ఆమె నివాసానికి వచ్చాడు. మహాలక్ష్మీ తనను పెళ్లి చేసుకోమని ముక్తిని బలవంతం చేయడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఇదే చివరకు ఆమె హత్యకు కారణమైంది. అప్పటికే పెళ్లయిన మహాలక్ష్మీకి భర్త, ఓ పాప కూడా ఉంది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఓ ఫ్లాట్లో ఉంటోంది. శనివారం బాధితురాలు ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో యజమాని మహాలక్ష్మీ తల్లి, సోదరికి ఫోన్ చేయడంతో, వారు ఇంటికి వచ్చి చూడటంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..