Emergency Movie: కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ విడుదలకు మార్గం సుగమం.. కొన్ని సీన్స్ కట్
- కంగనా రనౌత్ సినిమా 'ఎమర్జెన్సీ' విడుదలకు మార్గం సుగమం
- చిత్రంపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టులో మరోసారి విచారణ
- సినిమాలో కొన్ని కట్స్ చేయాల్సి ఉంటుందన్న సెన్సార్ బోర్డ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంగనా రనౌత్ సినిమా ‘ఎమర్జెన్సీ’ విడుదలపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు మార్గం సుగమం అయింది. ఈ చిత్రాన్ని విడుదల చేయవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తెలిపింది. అయితే.. సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీ సూచనల మేరకు సినిమాలో కొన్ని కట్స్ చేయాల్సి ఉంటుంది. జస్టిస్ బిపి కొలబావాలా, జస్టిస్ ఫిర్దౌస్ పోనివాలాలతో కూడిన ధర్మాసనం ముందు బోర్డు ఈ విషయాన్ని తెలిపింది. ఈ క్రమంలో.. చిత్రం విడుదలపై సోమవారం నాటికి ఈ విషయాన్ని పరిశీలిస్తామని చిత్ర నిర్మాత సంస్థ జీ స్టూడియోస్ చెబుతోంది.
Read Also: JC Prabhakar Reddy: గంజాయి అమ్మితే గ్రామ బహిష్కరణ.. జేసీ వార్నింగ్..
Also Read
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు..
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
జీ స్టూడియోస్ స్వయంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సెన్సార్ బోర్డ్ ద్వారా సర్టిఫికేట్ జారీ చేసేలా ఆదేశించాలని డిమాండ్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి సిక్కు సమాజాన్ని తప్పుగా చూపించారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత వివాదం ముదిరిపోవడంతో సెన్సార్ బోర్డు విడుదలను వాయిదా వేసింది. ఆగస్ట్ 29న ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు ముందు తమ దరఖాస్తును సమర్పించామని జీ స్టూడియోస్ కోర్టులో తెలిపింది. అయితే ఇప్పటి వరకు బోర్డు నుంచి సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు.
Read Also: Hydra Team: మూసీ నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్..
జబల్పూర్ సిక్కు సంగత్, ఇతర పార్టీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని.. ఆ తర్వాత సర్టిఫికేట్ జారీ చేయాలని సెప్టెంబర్ 4న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కు చెప్పామని గతంలో కోర్టు పేర్కొంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు.. కోర్టు సెప్టెంబర్ 25 లోగా నిర్ణయం తీసుకోవాలని బోర్డుని కోరింది, అయితే అప్పుడు కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు విడుదలకు సంబంధించి.. సూచించిన కట్స్ తర్వాత, సినిమాను థియేటర్లలో విడుదల చేయవచ్చని బోర్డు కోర్టులో తెలిపింది. ఈ చిత్రంలో కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఈ చిత్రానికి ప్రధాన అంశం 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!