Emergency Movie: కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ విడుదలకు మార్గం సుగమం.. కొన్ని సీన్స్ కట్
- కంగనా రనౌత్ సినిమా 'ఎమర్జెన్సీ' విడుదలకు మార్గం సుగమం
- చిత్రంపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టులో మరోసారి విచారణ
- సినిమాలో కొన్ని కట్స్ చేయాల్సి ఉంటుందన్న సెన్సార్ బోర్డ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంగనా రనౌత్ సినిమా ‘ఎమర్జెన్సీ’ విడుదలపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు మార్గం సుగమం అయింది. ఈ చిత్రాన్ని విడుదల చేయవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తెలిపింది. అయితే.. సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీ సూచనల మేరకు సినిమాలో కొన్ని కట్స్ చేయాల్సి ఉంటుంది. జస్టిస్ బిపి కొలబావాలా, జస్టిస్ ఫిర్దౌస్ పోనివాలాలతో కూడిన ధర్మాసనం ముందు బోర్డు ఈ విషయాన్ని తెలిపింది. ఈ క్రమంలో.. చిత్రం విడుదలపై సోమవారం నాటికి ఈ విషయాన్ని పరిశీలిస్తామని చిత్ర నిర్మాత సంస్థ జీ స్టూడియోస్ చెబుతోంది.
Read Also: JC Prabhakar Reddy: గంజాయి అమ్మితే గ్రామ బహిష్కరణ.. జేసీ వార్నింగ్..
Also Read
- Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
జీ స్టూడియోస్ స్వయంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సెన్సార్ బోర్డ్ ద్వారా సర్టిఫికేట్ జారీ చేసేలా ఆదేశించాలని డిమాండ్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి సిక్కు సమాజాన్ని తప్పుగా చూపించారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత వివాదం ముదిరిపోవడంతో సెన్సార్ బోర్డు విడుదలను వాయిదా వేసింది. ఆగస్ట్ 29న ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు ముందు తమ దరఖాస్తును సమర్పించామని జీ స్టూడియోస్ కోర్టులో తెలిపింది. అయితే ఇప్పటి వరకు బోర్డు నుంచి సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు.
Read Also: Hydra Team: మూసీ నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్..
జబల్పూర్ సిక్కు సంగత్, ఇతర పార్టీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని.. ఆ తర్వాత సర్టిఫికేట్ జారీ చేయాలని సెప్టెంబర్ 4న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కు చెప్పామని గతంలో కోర్టు పేర్కొంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు.. కోర్టు సెప్టెంబర్ 25 లోగా నిర్ణయం తీసుకోవాలని బోర్డుని కోరింది, అయితే అప్పుడు కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు విడుదలకు సంబంధించి.. సూచించిన కట్స్ తర్వాత, సినిమాను థియేటర్లలో విడుదల చేయవచ్చని బోర్డు కోర్టులో తెలిపింది. ఈ చిత్రంలో కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఈ చిత్రానికి ప్రధాన అంశం 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ.
తాజావార్తలు
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
-
Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!