Emergency Movie: కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ విడుదలకు మార్గం సుగమం.. కొన్ని సీన్స్ కట్
- కంగనా రనౌత్ సినిమా 'ఎమర్జెన్సీ' విడుదలకు మార్గం సుగమం
- చిత్రంపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టులో మరోసారి విచారణ
- సినిమాలో కొన్ని కట్స్ చేయాల్సి ఉంటుందన్న సెన్సార్ బోర్డ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంగనా రనౌత్ సినిమా ‘ఎమర్జెన్సీ’ విడుదలపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు మార్గం సుగమం అయింది. ఈ చిత్రాన్ని విడుదల చేయవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తెలిపింది. అయితే.. సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీ సూచనల మేరకు సినిమాలో కొన్ని కట్స్ చేయాల్సి ఉంటుంది. జస్టిస్ బిపి కొలబావాలా, జస్టిస్ ఫిర్దౌస్ పోనివాలాలతో కూడిన ధర్మాసనం ముందు బోర్డు ఈ విషయాన్ని తెలిపింది. ఈ క్రమంలో.. చిత్రం విడుదలపై సోమవారం నాటికి ఈ విషయాన్ని పరిశీలిస్తామని చిత్ర నిర్మాత సంస్థ జీ స్టూడియోస్ చెబుతోంది.
Read Also: JC Prabhakar Reddy: గంజాయి అమ్మితే గ్రామ బహిష్కరణ.. జేసీ వార్నింగ్..
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
జీ స్టూడియోస్ స్వయంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సెన్సార్ బోర్డ్ ద్వారా సర్టిఫికేట్ జారీ చేసేలా ఆదేశించాలని డిమాండ్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి సిక్కు సమాజాన్ని తప్పుగా చూపించారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత వివాదం ముదిరిపోవడంతో సెన్సార్ బోర్డు విడుదలను వాయిదా వేసింది. ఆగస్ట్ 29న ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు ముందు తమ దరఖాస్తును సమర్పించామని జీ స్టూడియోస్ కోర్టులో తెలిపింది. అయితే ఇప్పటి వరకు బోర్డు నుంచి సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు.
Read Also: Hydra Team: మూసీ నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్..
జబల్పూర్ సిక్కు సంగత్, ఇతర పార్టీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని.. ఆ తర్వాత సర్టిఫికేట్ జారీ చేయాలని సెప్టెంబర్ 4న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కు చెప్పామని గతంలో కోర్టు పేర్కొంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు.. కోర్టు సెప్టెంబర్ 25 లోగా నిర్ణయం తీసుకోవాలని బోర్డుని కోరింది, అయితే అప్పుడు కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు విడుదలకు సంబంధించి.. సూచించిన కట్స్ తర్వాత, సినిమాను థియేటర్లలో విడుదల చేయవచ్చని బోర్డు కోర్టులో తెలిపింది. ఈ చిత్రంలో కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఈ చిత్రానికి ప్రధాన అంశం 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!