Emergency Movie: కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ విడుదలకు మార్గం సుగమం.. కొన్ని సీన్స్ కట్
- కంగనా రనౌత్ సినిమా 'ఎమర్జెన్సీ' విడుదలకు మార్గం సుగమం
- చిత్రంపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టులో మరోసారి విచారణ
- సినిమాలో కొన్ని కట్స్ చేయాల్సి ఉంటుందన్న సెన్సార్ బోర్డ్.
కంగనా రనౌత్ సినిమా ‘ఎమర్జెన్సీ’ విడుదలపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు మార్గం సుగమం అయింది. ఈ చిత్రాన్ని విడుదల చేయవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తెలిపింది. అయితే.. సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీ సూచనల మేరకు సినిమాలో కొన్ని కట్స్ చేయాల్సి ఉంటుంది. జస్టిస్ బిపి కొలబావాలా, జస్టిస్ ఫిర్దౌస్ పోనివాలాలతో కూడిన ధర్మాసనం ముందు బోర్డు ఈ విషయాన్ని తెలిపింది. ఈ క్రమంలో.. చిత్రం విడుదలపై సోమవారం నాటికి ఈ విషయాన్ని పరిశీలిస్తామని చిత్ర నిర్మాత సంస్థ జీ స్టూడియోస్ చెబుతోంది.
Read Also: JC Prabhakar Reddy: గంజాయి అమ్మితే గ్రామ బహిష్కరణ.. జేసీ వార్నింగ్..
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ... 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
- Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
జీ స్టూడియోస్ స్వయంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సెన్సార్ బోర్డ్ ద్వారా సర్టిఫికేట్ జారీ చేసేలా ఆదేశించాలని డిమాండ్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి సిక్కు సమాజాన్ని తప్పుగా చూపించారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత వివాదం ముదిరిపోవడంతో సెన్సార్ బోర్డు విడుదలను వాయిదా వేసింది. ఆగస్ట్ 29న ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు ముందు తమ దరఖాస్తును సమర్పించామని జీ స్టూడియోస్ కోర్టులో తెలిపింది. అయితే ఇప్పటి వరకు బోర్డు నుంచి సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు.
Read Also: Hydra Team: మూసీ నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్..
జబల్పూర్ సిక్కు సంగత్, ఇతర పార్టీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని.. ఆ తర్వాత సర్టిఫికేట్ జారీ చేయాలని సెప్టెంబర్ 4న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కు చెప్పామని గతంలో కోర్టు పేర్కొంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు.. కోర్టు సెప్టెంబర్ 25 లోగా నిర్ణయం తీసుకోవాలని బోర్డుని కోరింది, అయితే అప్పుడు కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు విడుదలకు సంబంధించి.. సూచించిన కట్స్ తర్వాత, సినిమాను థియేటర్లలో విడుదల చేయవచ్చని బోర్డు కోర్టులో తెలిపింది. ఈ చిత్రంలో కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఈ చిత్రానికి ప్రధాన అంశం 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ.
తాజావార్తలు
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
-
JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ… 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో