Waqf Bill: విపక్షాల ఆందోళనతో “పార్లమెంట్ కమిటీ”కి వక్ఫ్ బిల్లు..
- విపక్షాల ఆందోళనతో "పార్లమెంట్ కమిటీ"కి వక్ఫ్ బిల్లు..
- బిల్లును వ్యతిరేకించి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు..
- వక్ఫ్ బోర్డు మాఫియా వశమైందన్న బీజేపీ..
- రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Bill: వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాలకు’ కత్తెర వేసేందుకు, మిగిలిన కమ్యూనిటీలకు ప్రాధాన్యత దక్కేలా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లు రాజ్యంగవ్యతిరేకమని, రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాంగ్రెస్తో పాటు సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, ఎంఐఎం పార్టీలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, ప్రతిపక్షాలకు కేంద్రం ధీటుగా సమాధానం ఇచ్చింది. ఈ బిల్లు కాంగ్రెస్ హయాంలోని సచార్ కమిటీ సిఫారసుల ఆధారంగా రూపొందించామని, వక్ఫ్ బోర్డు మాఫియా వశమైందని కేంద్రమంత్రి అన్నారు.
Read Also: Samantha : నాగచైతన్య ఎంగేజ్మెంట్.. ఒంటరి వాళ్ళు కాదని గుర్తుంచుకోవాలంటూ సమంత సంచలన పోస్ట్
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడంతో వక్ఫ్ సవరణ బిల్లు జాయింట్ పార్లమెంట్ కమిటీ(జేపీసీ)కి పంపబడింది. 1995 చట్టంలో సవరణలు చేస్తూ, ముస్లిం మహిళలను వక్ఫ్ బోర్డుల్లో చేర్చడం, ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే ముందు భూమిని ధృవీకరించడం వంటి ముఖ్యమైన మార్పులను కొత్తగా తీసుకురాబోతున్న బిల్లు ప్రతిపాదిస్తుంది. వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు మరియు అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని కూడా నిర్దేశించింది. మహిళల వారసత్వ సంపదకు రక్షణ కల్పించాలన్నది మరో కీలక ప్రతిపాదన. వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతర సభ్యులను చేర్చాలనే నిబంధన ప్రతిపాదిత చట్టంలోని మరో వివాదాస్పద అంశం.
లోక్సభలో బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇది కఠినమైన చట్టమని, మతస్వేచ్ఛ, సమాఖ్య వ్యవస్థపై దాడి అని అన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ కూడా ఈ బిల్లుని వ్యతిరేకించింది. ఈ బిల్లును బాగా ఆలోచించి రాజకీయాల్లో భాగంగా ప్రవేశపెట్టారని విమర్శించింది. ప్రజాస్వామ్య ప్రక్రియ ఉన్నప్పుడు వ్యక్తుల్ని ఎందుకు నామినేట్ చేయాలని ప్రశ్నించింది. ముస్లిం కాని వారిని వక్ఫ్ బోర్డులో నామినేట్ చేయడం ఏమిటి..? అని ప్రశ్నించింది. ఇది మైనారిటీ వర్గానికి వ్యతిరేకమని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు.
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!