Ashok Gehlot: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ బుధవారం అన్నారు. ప్రస్తుతం తనకు రెండు పనులు అప్పగించబడ్డాయని ఆయన తెలిపారు. గుజరాత్ పరిశీలకుడిగా, మరొకటి రాజస్థాన్ ముఖ్యమంత్రిగా.. కాంగ్రెస్ అధ్యక ఎన్నికలు జరుగుతున్నందున పనిని నిజాయితీగా పూర్తి సంకల్పంతో చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడని పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ సూచించినట్లు సమాచారం. ఢిల్లీలో ‘ఇన్వెస్ట్ రాజస్థాన్ 2022’ సదస్సు సందర్భంగా సీఎం గహ్లోత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నానన్నారు. ఆయన ఆదేశాన్ని స్వీకరించే చివరి క్షణం వరకు తాను ప్రయత్నిస్తానన్నారు. రాహుల్ గాంధే అధ్యక్షుడిగా ఉండాలని ఆయన పదే పదే అన్నారు. ఆగస్టు 20 వరకు కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని పార్టీ ప్రకటించింది. అయితే అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, రాహుల్ గాంధీ ఇప్పటి వరకు వైఖరిని క్లియర్ చేయలేదు.ఇన్వెస్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొన్న ఆయన.. ఈ రోజుల్లో రాజకీయ ఎత్తుగడలు వేయడం సరికాదని, ప్రభుత్వాలను కూల్చే యుగం ఇది అని ఆయన మండిపడ్డారు.
PM Narendra Modi: రేపు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2022 గ్రాండ్ ఫినాలేలో ప్రధాని ప్రసంగం
ఈడీ, సీబీఐ కార్యకలాపాలపై దేశంలో ప్రస్తుతం చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడులను వ్యతిరేకిస్తూ కేంద్రం ప్రభుత్వం రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వాన్ని ఉదాహరణగా చూపుతూ, సుస్థిర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్రం కొత్త మోడల్ను రూపొందించిందని ఆరోపించారు. చాలా మందిపై దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.