PM Modi: కాంగ్రెస్కి ఓటు బ్యాంక్ వైరస్.. వక్ఫ్ చట్టంపై మోడీ సంచలనం..
- కాంగ్రెస్పై విరుచుకుపడిన ప్రధాని మోడీ..
- ఆ పార్టీకి ఓటు బ్యాంక్ వైరస్ పట్టిందన్న పీఎం..
- వక్ఫ్ని ఓట్ల కోసం వాడుకుందని విమర్శ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: హర్యానా హిస్సార్లో సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు చట్టాలను మార్చిందని దుయ్యబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వక్ఫ్ బోర్డు రూల్స్ని కాంగ్రెస్ మార్చిందని అన్నారు. కాంగ్రెస్కి ఓటు బ్యాంక్ వైరస్ పట్టుకుందని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీకు వ్యతిరేకంగా ఆ పార్టీ పనిచేస్తుందని, వక్ఫ్ బోర్డు పేరుతో కాంగ్రెస్ భూముల్ని దోచుకుందని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను మోసం చేసిందని, వాళ్ల రిజర్వేషన్లను చీల్చి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. వక్ఫ్ వల్ల పేద ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం లేదని, పేద ముస్లింలు పంచర్ షాపులకే పరిమితమయ్యారని అన్నారు. కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు పేరుతో రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఒక్క ముస్లింని కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించలేదు, ఎందుకు..? అని మోడీ ప్రశ్నించారు.
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
Read Also: Mehul Choksi: 7 ఏళ్లుగా మెహుల్ చోక్సీ కోసం భారత్ వేట.. చివరకు ఇలా చిక్కాడు..
వక్ఫ బోర్డు పేరiతో లక్షల హెక్టార్ల భూమిని కొల్లగొట్టారని, వక్ఫ్ బోర్డు పేరుతో పేదలు, ఆదివాసుల భూముల్ని లాక్కున్నారని మోడీ అన్నారు. పేదు ముస్లిం మహిళలు, వితంతు మహిళలు కేంద్ర ప్రభుత్వాన్ని వక్ఫ్ బోర్డుపై లేఖలు రాశారని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. కాంగ్రెస్ రాజ్యాంగం కన్నా వక్ఫ్నే పెద్దదిగా చేసిందని అన్నారు.
2014కు ముందు దేశంలో 74 ఏయిర్పోర్టులు ఉంటే, ఈ రోజు 150 ఎయిర్పోర్టలు ఉన్నాయని మోడీ అన్నారు. కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో 74ఏయిర్ పోర్టులు మాత్రమే నిర్మించిందని అన్నారు. బీజేపీ పాలనలో కనెక్టివిటీ పెంచేందుకు ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. పేదల సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!