PM Modi: కాంగ్రెస్కి ఓటు బ్యాంక్ వైరస్.. వక్ఫ్ చట్టంపై మోడీ సంచలనం..
- కాంగ్రెస్పై విరుచుకుపడిన ప్రధాని మోడీ..
- ఆ పార్టీకి ఓటు బ్యాంక్ వైరస్ పట్టిందన్న పీఎం..
- వక్ఫ్ని ఓట్ల కోసం వాడుకుందని విమర్శ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: హర్యానా హిస్సార్లో సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు చట్టాలను మార్చిందని దుయ్యబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వక్ఫ్ బోర్డు రూల్స్ని కాంగ్రెస్ మార్చిందని అన్నారు. కాంగ్రెస్కి ఓటు బ్యాంక్ వైరస్ పట్టుకుందని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీకు వ్యతిరేకంగా ఆ పార్టీ పనిచేస్తుందని, వక్ఫ్ బోర్డు పేరుతో కాంగ్రెస్ భూముల్ని దోచుకుందని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను మోసం చేసిందని, వాళ్ల రిజర్వేషన్లను చీల్చి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. వక్ఫ్ వల్ల పేద ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం లేదని, పేద ముస్లింలు పంచర్ షాపులకే పరిమితమయ్యారని అన్నారు. కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు పేరుతో రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఒక్క ముస్లింని కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించలేదు, ఎందుకు..? అని మోడీ ప్రశ్నించారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Read Also: Mehul Choksi: 7 ఏళ్లుగా మెహుల్ చోక్సీ కోసం భారత్ వేట.. చివరకు ఇలా చిక్కాడు..
వక్ఫ బోర్డు పేరiతో లక్షల హెక్టార్ల భూమిని కొల్లగొట్టారని, వక్ఫ్ బోర్డు పేరుతో పేదలు, ఆదివాసుల భూముల్ని లాక్కున్నారని మోడీ అన్నారు. పేదు ముస్లిం మహిళలు, వితంతు మహిళలు కేంద్ర ప్రభుత్వాన్ని వక్ఫ్ బోర్డుపై లేఖలు రాశారని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. కాంగ్రెస్ రాజ్యాంగం కన్నా వక్ఫ్నే పెద్దదిగా చేసిందని అన్నారు.
2014కు ముందు దేశంలో 74 ఏయిర్పోర్టులు ఉంటే, ఈ రోజు 150 ఎయిర్పోర్టలు ఉన్నాయని మోడీ అన్నారు. కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో 74ఏయిర్ పోర్టులు మాత్రమే నిర్మించిందని అన్నారు. బీజేపీ పాలనలో కనెక్టివిటీ పెంచేందుకు ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. పేదల సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!