Mehul Choksi: 7 ఏళ్లుగా మెహుల్ చోక్సీ కోసం భారత్ వేట.. చివరకు ఇలా చిక్కాడు..
- ఏడేళ్లుగా వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కోసం భారత్ వేట..
- పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్న చోక్సీ..
- చివరకు బెల్జియంలో ఇలా చిక్కారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehul Choksi: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ని రూ. 12,636 కోట్ల మోసం చేసి విదేశాలకు పారిపోయిన డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్ట్ చేశారు. ఆర్థిక నేరస్తుడిని భారత్ దేశానికి తీసుకువచ్చేందుకు మన సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలు 8 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. తాజాగా, భారత్ అప్పగింత అభ్యర్థన మేరకు బెల్జియంలో అదుపులోకి తీసుకున్నారు.
గీతాంజలి గ్రూప్ యజమాని అయిన మెహుల్ చోక్సీ, తన మేనల్లుడు నీరవ్ మోడీ, అతని భార్య అమీ మోడీ, అతని సోదరుడు నీషాల్ మోడీతో కలిసి ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 12,636 కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చే కొన్ని వారాలకు ముందే విదేశాలకు చెక్కేశాడు. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి ఆంటిగ్వా పౌరసత్వం తెచ్చుకున్నాడు.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
Read Also: Merugu Nagarjuna: అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు
అయితే, 2021లో చోక్సీ డొమినికల్ రిపబ్లిక్లోకి అక్రమంగా ప్రవేశించడంతో అతడిని ఆ దేశంలో అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అతడిని కస్టడీలోకి తీసుకునేందుకు అక్కడికి వెళ్లింది. చోక్సీ న్యాయవాదులు అతడి చికిత్స కోసం ఆంటిగ్వా వెళ్లాలని, విచారణ తర్వాత తిరిగి వస్తామని డొమినికన్ కోర్టుకు హామీ ఇచ్చారు. 51 రోజుల జైలు శిక్ష అనంతరం చోక్సీకి బ్రిటిష్ క్వీన్స్ ప్రివీ కౌన్సిల్ నుంచి ఉపశమనం లభించింది. ఆ తర్వాత అతడు ఆంటిగ్వాకు తిరిగి వెళ్లాడు. దీని తర్వాత డొమినికన్ రిపబ్లిక్ అతడిపై అక్రమ ప్రవేశ అభియోగాలను కొట్టేసింది.
అతడి కదలికల్ని సీబీఐ, ఈడీ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూనే ఉన్నాయి. గత సంవత్సరం అతను బెల్జియంలో ఉన్నట్లు కనుగొన్నారు. మోసానికి సంబంధించిన పత్రాలను భారత అధికారులు బెల్జియంకు సమర్పించారు. బెల్జియం పోలీసులు ఏప్రిల్ 12న చోక్సీని అరెస్ట్ చేశారు. అతను తన ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కనుగొన్నారు. చోక్సీ భార్య ప్రతీ బెల్జియం పౌరురాలు. నివేదిక ప్రకారం, చోక్సీ బెల్జియంలో నివాసం పొందేందుకు నకిలీ పత్రాలను సమర్పించినట్లు తేలింది. తాను భారత్, ఆంటిగ్వా పౌరుడనే విషయాన్ని కూడా దాచిపెట్టాడు.
అంతకు ముందు, అతడి న్యాయవాదులు చోక్సీకి బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం బెల్జియంలో ఉన్నందున అతను భారత్ తిరిగి రాలేడని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత ఏజెన్సీలకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు చోక్సీ చెప్పాడు.
తాజావార్తలు
-
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్పై ప్రతీకారమే మిగిలింది..!
-
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!