Tamil Nadu: సీఎం అభ్యర్థిగా స్టార్ హీరో విజయ్.. బీజేపీతో పొత్తుపై క్లారిటీ..
- తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టార్ హీరో విజయ్..
- సమావేశంలో నిర్ణయం తీసుకున్న టీవీకే పార్టీ..
- బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని తేల్చిన పార్టీ చీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు అంతా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026లో జరిగే ఎన్నికల్లో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమిళగ వెట్రీ కజగం (టీవీకే) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కమిటీ సమావేశం తర్వాత మాట్లాడుతూ.. తమ పార్టీ ఎప్పుడూ బీజేపీతో పొత్తు పెట్టుకోదని, బహిరంగంగా, లోపాయికారిగా కూడా పొత్తు ఉండదని విజయ్ స్పష్టం చేశారు.
‘‘బీజేపీ వేరే ఎక్కడైనా విష బీజాలు నాటవచ్చు, కానీ తమిళనాడులో కాదు’’ అని అన్నారు. తమ పార్టీకి సైద్ధాంతిక శత్రువుగా ఉండే వారితో చేతులు కలిపే అవకాశాన్ని స్టార్ హీరో విజయ్ స్పష్టంగా తిరస్కరించారు. మీరు అన్నా, పెరియార్లను వ్యతిరేకించలేరు, అవమానపరచలేదు, తమిళనాడులో మీరు గెలవలేరు. బీజేపీతో చేతులు కలపడానికి టీవీకే డీఎంకే లేదా ఏఐఏడీఎంకే కాదు అని విజయ్ చెప్పారు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
Read Also: CUET UG 2025: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
ఎన్నికల ముందు పొత్తులపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారాన్ని పార్టీ విజయ్కు అప్పగించింది. టీవీకే తన సభ్యత్వాలను విస్తరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రెండు కోట్ల మంది సభ్యులను చేర్చుకోవడానికి విజయ్ ఈ ఏడాది సెప్టెంబర్ నునంచి డిసెంబర్ వరకు తమిళనాడు అంతటా రాష్ట్రవ్యాప్త పర్యటన చేపడుతారని తెలుస్తోంది. ఓటర్లను కలిసి వారి మద్దతును పొందాలని చూస్తున్నారు.
టీవీకే రెండో రాష్ట్ర సమావేశం ఆగస్టులో జరగనుంది. ఆ సమయంలో మరిన్ని వ్యూహాలను బయటపెట్టే అవకాశం ఉంది. కచ్చతీవు ద్వీపాన్ని కేంద్రం తిరిగి పొందాలని టీవీకే డిమాండ్ చేసింది. కీజాడిలో కనుగొన్న వాటిని కప్పిపుచ్చే ప్రయత్నాలను ఖండించింది, ఇది 2000 ఏళ్ల నాటి తమిళ నాగరికతకు నిదర్శనమని పేర్కొంది. ఢిల్లీ నిరసనల్లో రైతులకుపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును టీవీకే ఖండించింది. సీఎం స్టాలిన్ కేంద్రానికి రాసిన లేఖలు సరిపోవాని, కృష్ణగిరి, తేని, తిరువళ్లూరు, సేలం మరియు దిండిగల్లలో మామిడి రైతుల హక్కుల కోసం పోరాడతామని టీవీకే ప్రతిజ్ఞ చేసింది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!