Tamil Nadu: సీఎం అభ్యర్థిగా స్టార్ హీరో విజయ్.. బీజేపీతో పొత్తుపై క్లారిటీ..
- తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టార్ హీరో విజయ్..
- సమావేశంలో నిర్ణయం తీసుకున్న టీవీకే పార్టీ..
- బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని తేల్చిన పార్టీ చీఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు అంతా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026లో జరిగే ఎన్నికల్లో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమిళగ వెట్రీ కజగం (టీవీకే) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కమిటీ సమావేశం తర్వాత మాట్లాడుతూ.. తమ పార్టీ ఎప్పుడూ బీజేపీతో పొత్తు పెట్టుకోదని, బహిరంగంగా, లోపాయికారిగా కూడా పొత్తు ఉండదని విజయ్ స్పష్టం చేశారు.
‘‘బీజేపీ వేరే ఎక్కడైనా విష బీజాలు నాటవచ్చు, కానీ తమిళనాడులో కాదు’’ అని అన్నారు. తమ పార్టీకి సైద్ధాంతిక శత్రువుగా ఉండే వారితో చేతులు కలిపే అవకాశాన్ని స్టార్ హీరో విజయ్ స్పష్టంగా తిరస్కరించారు. మీరు అన్నా, పెరియార్లను వ్యతిరేకించలేరు, అవమానపరచలేదు, తమిళనాడులో మీరు గెలవలేరు. బీజేపీతో చేతులు కలపడానికి టీవీకే డీఎంకే లేదా ఏఐఏడీఎంకే కాదు అని విజయ్ చెప్పారు.
Also Read
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
Read Also: CUET UG 2025: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
ఎన్నికల ముందు పొత్తులపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారాన్ని పార్టీ విజయ్కు అప్పగించింది. టీవీకే తన సభ్యత్వాలను విస్తరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రెండు కోట్ల మంది సభ్యులను చేర్చుకోవడానికి విజయ్ ఈ ఏడాది సెప్టెంబర్ నునంచి డిసెంబర్ వరకు తమిళనాడు అంతటా రాష్ట్రవ్యాప్త పర్యటన చేపడుతారని తెలుస్తోంది. ఓటర్లను కలిసి వారి మద్దతును పొందాలని చూస్తున్నారు.
టీవీకే రెండో రాష్ట్ర సమావేశం ఆగస్టులో జరగనుంది. ఆ సమయంలో మరిన్ని వ్యూహాలను బయటపెట్టే అవకాశం ఉంది. కచ్చతీవు ద్వీపాన్ని కేంద్రం తిరిగి పొందాలని టీవీకే డిమాండ్ చేసింది. కీజాడిలో కనుగొన్న వాటిని కప్పిపుచ్చే ప్రయత్నాలను ఖండించింది, ఇది 2000 ఏళ్ల నాటి తమిళ నాగరికతకు నిదర్శనమని పేర్కొంది. ఢిల్లీ నిరసనల్లో రైతులకుపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును టీవీకే ఖండించింది. సీఎం స్టాలిన్ కేంద్రానికి రాసిన లేఖలు సరిపోవాని, కృష్ణగిరి, తేని, తిరువళ్లూరు, సేలం మరియు దిండిగల్లలో మామిడి రైతుల హక్కుల కోసం పోరాడతామని టీవీకే ప్రతిజ్ఞ చేసింది.
తాజావార్తలు
-
Potti Sriramulu’s Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
-
Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
-
Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. సెలెక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
-
PV Sindhu: సెమీస్లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!