Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు అంతా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026లో జరిగే ఎన్నికల్లో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమిళగ వెట్రీ కజగం (టీవీకే) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కమిటీ సమావేశం తర్వాత మాట్లాడుతూ.. తమ పార్టీ ఎప్పుడూ బీజేపీతో పొత్తు పెట్టుకోదని, బహిరంగంగా, లోపాయికారిగా కూడా పొత్తు ఉండదని విజయ్ స్పష్టం చేశారు.
కచ్చతీవు ద్వీపం అంశం మరోసారి వార్తల్లోకెక్కింది. ఇప్పుడు ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. దీని వల్ల శ్రీలంకతో భారత్ సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉందని సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు.