UP BJP: యూపీ బీజేపీలో భారీ కదుపు.. రాజీనామాకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..
- యూపీ బీజేపీలో భారీ కుదుపు..
- రాజీనామాకు సిద్ధమైన రాష్ట్ర బీజేపీ చీఫ్..
- లోక్సభ ఎన్నికల వైఫల్యానికి బాధ్యత..
- ప్రధానితో భేటీ అయిన అమిత్ షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP BJP: లోక్సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఘోర పరాజయం చూసింది. 2014, 2019 ఎన్నికల్లో దాదాపుగా రాష్ట్రంలోని అన్ని స్థానాలను క్లీన్స్వీప్ చేసిన ఆ పార్టీ, 2024 ఎన్నికల్లో మాత్రం దారుణమైన ఫలితాలను చూసింది. అయోధ్య రామమందిరం నిర్మించిన ఫైజాబాద్ నియోజకవర్గంలో కూడా బీజేపీ ఓడిపోవడం ఒకింత ఆ పార్టీని తీవ్ర నిరాశలోకి తీసుకెళ్లింది. మొత్తం 80 ఎంపీ సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి 43 సీట్లను గెలుచుకోగా, బీజేపీ కూటమి కేవలం 36 చోట్ల మాత్రమే విజయం సాధించింది. 2019లో బీజేపీకి 62 సీట్లు ఉంటే బీజేపీ సొంతగా ఈ సారి 33 స్థానాలు కైవసం చేసుకుంది.
ఇదిలా ఉంటే, మరోవైపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఖాళీలు ఏర్పడిన 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటు ఇటీవల 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే యూపీ ఉప ఎన్నికలు పార్టీకి కీలకమయ్యాయి. దీనిపై కార్యాచరణ రూపొందిస్తున్నారు.
Also Read
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
Read Also: Karnataka: కన్నడ మాట్లాడే వారికే కంపెనీల్లో ఉద్యోగాలు..!బెంగళూరులో ఐటీ కంపెనీల పరిస్థితేంటి?
ఈ క్రమంలోనే యూపీ బీజేపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్కి, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలకు మధ్య విభేదాలు ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నిన్న బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాతో కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ యూపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి భేటీ అయ్యారు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం యూపీ బీజేపీ యూనిట్ని పూర్తిగా ప్రక్షాళన చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఇటీవల లోక్సభ ఎన్నికల వైఫల్యానికి గానూ తాను రాజీనామా చేస్తానని యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి, ప్రధాన నరేంద్రమోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ప్రతిపాదించారు. దీనిపై చర్చించేందుకు అమిత్ షా, ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఎన్నికల ఎదురుదెబ్బ నుండి తిరిగి పుంజుకోవడానికి మరియు 2027 రాష్ట్ర ఎన్నికలకు సిద్ధమవుతున్నందున, బిజెపి తన రాష్ట్ర చీఫ్గా ఒబిసి నాయకుడిని నియమించాలని అనుకుంటోంది. జాట్ వర్గంలో బీజేపీపై ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చేందుకు చౌదరికి 2022లో రాష్ట్ర చీఫ్గా నియమించారు. ప్రస్తుతం ఉప ఎన్నికల్లు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఓబీసీ నాయకుడికి రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది.
తాజావార్తలు
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
-
CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..