UP BJP: యూపీ బీజేపీలో భారీ కదుపు.. రాజీనామాకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..
- యూపీ బీజేపీలో భారీ కుదుపు..
- రాజీనామాకు సిద్ధమైన రాష్ట్ర బీజేపీ చీఫ్..
- లోక్సభ ఎన్నికల వైఫల్యానికి బాధ్యత..
- ప్రధానితో భేటీ అయిన అమిత్ షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP BJP: లోక్సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఘోర పరాజయం చూసింది. 2014, 2019 ఎన్నికల్లో దాదాపుగా రాష్ట్రంలోని అన్ని స్థానాలను క్లీన్స్వీప్ చేసిన ఆ పార్టీ, 2024 ఎన్నికల్లో మాత్రం దారుణమైన ఫలితాలను చూసింది. అయోధ్య రామమందిరం నిర్మించిన ఫైజాబాద్ నియోజకవర్గంలో కూడా బీజేపీ ఓడిపోవడం ఒకింత ఆ పార్టీని తీవ్ర నిరాశలోకి తీసుకెళ్లింది. మొత్తం 80 ఎంపీ సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి 43 సీట్లను గెలుచుకోగా, బీజేపీ కూటమి కేవలం 36 చోట్ల మాత్రమే విజయం సాధించింది. 2019లో బీజేపీకి 62 సీట్లు ఉంటే బీజేపీ సొంతగా ఈ సారి 33 స్థానాలు కైవసం చేసుకుంది.
ఇదిలా ఉంటే, మరోవైపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఖాళీలు ఏర్పడిన 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటు ఇటీవల 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే యూపీ ఉప ఎన్నికలు పార్టీకి కీలకమయ్యాయి. దీనిపై కార్యాచరణ రూపొందిస్తున్నారు.
Also Read
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
- TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Read Also: Karnataka: కన్నడ మాట్లాడే వారికే కంపెనీల్లో ఉద్యోగాలు..!బెంగళూరులో ఐటీ కంపెనీల పరిస్థితేంటి?
ఈ క్రమంలోనే యూపీ బీజేపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్కి, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలకు మధ్య విభేదాలు ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నిన్న బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాతో కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ యూపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి భేటీ అయ్యారు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం యూపీ బీజేపీ యూనిట్ని పూర్తిగా ప్రక్షాళన చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఇటీవల లోక్సభ ఎన్నికల వైఫల్యానికి గానూ తాను రాజీనామా చేస్తానని యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి, ప్రధాన నరేంద్రమోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ప్రతిపాదించారు. దీనిపై చర్చించేందుకు అమిత్ షా, ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఎన్నికల ఎదురుదెబ్బ నుండి తిరిగి పుంజుకోవడానికి మరియు 2027 రాష్ట్ర ఎన్నికలకు సిద్ధమవుతున్నందున, బిజెపి తన రాష్ట్ర చీఫ్గా ఒబిసి నాయకుడిని నియమించాలని అనుకుంటోంది. జాట్ వర్గంలో బీజేపీపై ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చేందుకు చౌదరికి 2022లో రాష్ట్ర చీఫ్గా నియమించారు. ప్రస్తుతం ఉప ఎన్నికల్లు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఓబీసీ నాయకుడికి రాష్ట్ర పగ్గాలు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది.
తాజావార్తలు
-
Allu Arjun – Venkatesh Iyer: ఐకాన్ స్టార్ ను కలిసిన వెంకటేశ్ అయ్యర్.. అల్లు అయాన్ కు స్పెషల్ గిఫ్ట్..!
-
Save The Tigers 3: ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 వచ్చేస్తోంది.. వెన్నెల కిషోర్ ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్
-
Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
-
Sonam Wangchuk: “నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా”.. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!