Delhi: ఈనెల 21న మోడీ అధ్యక్షతన ఆల్పార్టీ మీటింగ్.. లోక్సభ సమావేశాలపై చర్చ
- ఈనెల 21న మోడీ అధ్యక్షతన ఆల్పార్టీ మీటింగ్
- లోక్సభ సమావేశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2024-2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ అధ్యక్షతన ఆర్థిక వేత్తలు, నీతి అయోగ్ అధికారులతో భేటీ అయి బడ్జెట్ కూర్పుపై సూచలు, సలహాలు స్వీకరించారు.
ఇది కూడా చదవండి: Madhya pradesh: పోలీస్స్టేషన్లో పెళ్లి దుస్తుల్లో గిరిజన యువకుడు మృతి.. భగ్గుమన్న కుటుంబ సభ్యులు
Also Read
ఇదిలా ఉంటే ఈనెల 21న అఖిలపక్ష సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీలకు కేంద్రం ఆహ్వానాలు పంపింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు.. పార్టీ ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానాలు పంపారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్లోని మెయిన్ కమిటీ రూమ్లో భేటీ జరగనుంది.
ఇది కూడా చదవండి: Bhukya Yashwant: సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన మౌంట్ క్యాంగ్ యాట్సీ-2 అధిరోహకుడు..
ఇక పార్లమెంట్ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. గత ప్రత్యేక సమావేశాలు హాట్ హాట్ సాగాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వం ధ్వజమెత్తారు. మరోసారి లోక్సభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మరోసారి అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నీట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తు్న్నాయి. అలాగే రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కూడా ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. జరగబోయే సమావేశాలు హాట్ హాట్గానే సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Delhimeeting
తాజావార్తలు
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
-
Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!