Madhya pradesh: పోలీస్స్టేషన్లో పెళ్లి దుస్తుల్లో గిరిజన యువకుడు మృతి.. భగ్గుమన్న కుటుంబ సభ్యులు
- పోలీస్స్టేషన్లో పెళ్లి దుస్తుల్లో గిరిజన యువకుడు మృతి
- భగ్గుమన్న కుటుంబ సభ్యులు.. మధ్యప్రదేశ్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో దేవా అనే గిరిజన యువకుడు లాకప్ డెత్ తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. గుణలో పార్ధి వర్గానికి చెందిన 25 ఏళ్ల గిరిజన యువకుడు పోలీస్ కస్టడీలో మరణించాడు. దీంతో న్యాయం చేయాలంటూ బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు బట్టలు విప్పి నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కొంతమంది మహిళా బంధువులు తీవ్ర నిరసనతో తమ బట్టలు విప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహిళలు కలెక్టరేట్ కార్యాలయం లోపలకి చొచ్చుకొచ్చారు. ఇంకొందరు నేలమీద పడి బోరున విలపించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని బయటకు పంపేందుకు ప్రయత్నించగా అధికారులతో ఘర్షణకు దిగారు. ఈ తోపులాటలో ఒక మహిళ తలకు తీవ్ర రక్తస్రావం అయింది. ఒక పోలీస్ కూడా గాయపడ్డారు. మరికొందరి మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి.
Also Read
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
దేవా గుండెపోటుతో మృతి చెందాడన్న అధికారుల వాదనను గిరిపుత్రులు తోసిపుచ్చారు. పోలీస్ దెబ్బలకు చనిపోయాడని బంధువులు ఆరోపించారు. గుండెపోటుతో చిన్న పిల్లాడు ఎలా చనిపోతాడని… పోలీసులు కొట్టడంతోనే చనిపోయాడని దేవా మామ గంగారాం ఆరోపించారు.
దేవాది ఆదివారం బారాత్ జరగనుంది.. వివాహ ఊరేగింపునకు సిద్ధపడుతున్నారు. అందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. చివరి ఫొటో సాయంత్రం 4:30గంటలకు దేవా దిగాడు. ఇంతలో పోలీసులు వచ్చి దొంగతనం కేసులో దేవాను, అతడి మామ గంగారాంను పోలీసులు తీసుకెళ్లారు. అంతలోనే ఆదివారం రాత్రి దేవా చనిపోయాడని కుటుంబ సభ్యులకు పోలీసులు ఫోన్లో తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. ఇదిలా ఉంటే వధువు అప్పటికే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అలాగే అత్త సూరజ్బాయి కూడా నిప్పంటించుకుంది. ఈ పరిస్థితుల్లో అందరూ ఆందోళనలో ఉండగా… దేవా చనిపోయాడని వార్త రావడంతో మరింత కుంగిపోయారు. దీంతో పెద్ద ఎత్తున బంధువులు కలెక్టరేట్కు వెళ్లి ఆందోళన చేశారు.
గ్రామంలో జరిగిన దొంగతనంపై ప్రశ్నించినందుకే దేవా, గంగారామ్లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. దొంగిలించబడిన వస్తువులను రికవరీ చేసే సమయంలో దేవా ఛాతీ నొప్పితో బాధపడ్డాడని తెలిపారు. వెంటనే మయానా ఆసుపత్రికి, అటు తర్వాత జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. వైద్యులు 45 నిమిషాల పాటు సీపీఆర్ను అందించారని.. కానీ అప్పటికే అతడు మృతిచెందాడన్నారు. అయితే దేవాపై వివిధ పోలీసు స్టేషన్లలో ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఇక బాధితుల కుటుంబం భోపాల్లో శవపరీక్ష చేయాలని కోరింది.. అయితే అధికారుల హామీ తర్వాత మెజిస్టీరియల్ విచారణకు బంధువులు అంగీకరించారు.
తాజావార్తలు
-
Akhil Akkineni: ‘లెనిన్’తో బ్లాక్బస్టర్.. ఇక అఖిల్ టార్గెట్ మరింత పెద్దది.. నెక్స్ట్ మూవీపైనే ఫోకస్!
-
Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..