Delhi: ఢిల్లీలో దారుణం.. బ్రిటిష్ మహిళా టూరిస్ట్పై అత్యాచారం
- ఢిల్లీలో దారుణం
- బ్రిటిష్ మహిళా టూరిస్ట్పై అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. స్నేహం ముసుగులో యూకేకు చెందిన మహిళా పర్యాటకురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడి స్నేహితుడు కూడా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
యూకేకు చెందిన మహిళా పర్యాటకురాలు మంగళవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మహిపాల్పూర్లో ఒక హోటల్లో దిగింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఓ వ్యక్తి హోటల్కు వచ్చాడు. ఇదే అదునుగా భావించిన వ్యక్తి.. ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. వెంటనే అతడి నుంచి తప్పించుకునేందుకు అలారం మోగించింది. అంతేకాకుండా వెంటనే రిసెప్షన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. సాయం చేసేందుకు వస్తున్న వ్యక్తి కూడా లిఫ్ట్లో లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు నిందితులు కూడా స్నేహితులే కావడం విశేషం.
Also Read
- Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
- US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
- Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
- Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
ఇది కూడా చదవండి: Mohali: పార్కింగ్ విషయంలో ఘర్షణ.. యువ శాస్త్రవేత్త హత్య
రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయం ఉన్న వ్యక్తేనని తెలిపారు. హోటల్లో ఆమెను కలిసేందుకు వచ్చి అత్యాచారం చేశాడు. సాయం పేరిట మరో వ్యక్తి కూడా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: IPL 2025: ఆశలు రేకెత్తిస్తున్న కొత్త కెప్టెన్.. ఈసారి పంజాబ్ రాత రానేనా!
బాధితురాలితో నిందితుడికి సోషల్ మీడియాలో పరిచయం ఉంది. ఆ పరిచయం మీద.. నిందితుడిని కలిసేందుకు భారత్కు వచ్చింది. అయితే హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. జరిగిన సంఘటన గురించి పోలీసు అధికారులు.. బ్రిటిష్ హైకమిషన్కు కూడా సమాచారం అందించారు.
ఇటీవల కర్ణాటకలో కూడా ఇజ్రాయెల్ మహిళపై కూడా ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తుంగభద్ర నది కాలువ దగ్గర నక్షత్రాలు చూస్తుండగా ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనను మరువక ముందు దేశ రాజధానిలో మరో విదేశీ పర్యాటకురాలిపై అఘాయిత్యం జరగడం కలకలం రేపుతోంది.
ఇది కూడా చదవండి: Beerla Ilaiah: హరీష్ రావు ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారు..
తాజావార్తలు
-
White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
-
Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్కు కాదు, రేవంత్కే నా సపోర్ట్
-
Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
-
Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్పై మీ విమర్శలు ఎందుకు..’?
-
Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!