Delhi: ఢిల్లీలో దారుణం.. బ్రిటిష్ మహిళా టూరిస్ట్పై అత్యాచారం
- ఢిల్లీలో దారుణం
- బ్రిటిష్ మహిళా టూరిస్ట్పై అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. స్నేహం ముసుగులో యూకేకు చెందిన మహిళా పర్యాటకురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడి స్నేహితుడు కూడా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
యూకేకు చెందిన మహిళా పర్యాటకురాలు మంగళవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మహిపాల్పూర్లో ఒక హోటల్లో దిగింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఓ వ్యక్తి హోటల్కు వచ్చాడు. ఇదే అదునుగా భావించిన వ్యక్తి.. ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. వెంటనే అతడి నుంచి తప్పించుకునేందుకు అలారం మోగించింది. అంతేకాకుండా వెంటనే రిసెప్షన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. సాయం చేసేందుకు వస్తున్న వ్యక్తి కూడా లిఫ్ట్లో లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు నిందితులు కూడా స్నేహితులే కావడం విశేషం.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
ఇది కూడా చదవండి: Mohali: పార్కింగ్ విషయంలో ఘర్షణ.. యువ శాస్త్రవేత్త హత్య
రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయం ఉన్న వ్యక్తేనని తెలిపారు. హోటల్లో ఆమెను కలిసేందుకు వచ్చి అత్యాచారం చేశాడు. సాయం పేరిట మరో వ్యక్తి కూడా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: IPL 2025: ఆశలు రేకెత్తిస్తున్న కొత్త కెప్టెన్.. ఈసారి పంజాబ్ రాత రానేనా!
బాధితురాలితో నిందితుడికి సోషల్ మీడియాలో పరిచయం ఉంది. ఆ పరిచయం మీద.. నిందితుడిని కలిసేందుకు భారత్కు వచ్చింది. అయితే హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. జరిగిన సంఘటన గురించి పోలీసు అధికారులు.. బ్రిటిష్ హైకమిషన్కు కూడా సమాచారం అందించారు.
ఇటీవల కర్ణాటకలో కూడా ఇజ్రాయెల్ మహిళపై కూడా ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తుంగభద్ర నది కాలువ దగ్గర నక్షత్రాలు చూస్తుండగా ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనను మరువక ముందు దేశ రాజధానిలో మరో విదేశీ పర్యాటకురాలిపై అఘాయిత్యం జరగడం కలకలం రేపుతోంది.
ఇది కూడా చదవండి: Beerla Ilaiah: హరీష్ రావు ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారు..
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!