Uddhav Thackeray: పరువు నష్టం కేసులో ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్కు హైకోర్టు సమన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించడంతో ప్రస్తుతం పరువునష్టం కేసు జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ దొంగలందరికి మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ క్రిమినల్ పరువు నష్టం కేసు వేయగా..ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడటమే కాకుండా.. ఎంపీగా అనర్హత వేటు పడింది.
ఇదిలా ఉంటే పరువు నష్టం కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్కే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే, ఎంపీ సంజయ్ రౌత్ లకు ఢిల్లీ హైకోర్టు ఈ రోజు సమన్లు జారీ చేసింది. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎంపీ రాహుల్ రమేష్ షెవాలే దాకలు చేసిన పిటిషన్ పై కోర్టు సమన్లు జారీ చేసింది. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, అతడి వర్గం శివసేన గుర్తు అయిన ‘ విల్లు-బాణం’ను రూ.2,000 కోట్లకు కొనుగోలు చేశారని ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఠాక్రే వర్గం నేతలను అడ్డుకోవాలని షెవాలే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇది రాజకీయ సమస్య కాబట్టి ఎదుటి పక్షం వాదనలను వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు పేర్కొంది.
Also Read
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
Read Also: Drugs Price : ఫార్మా కంపెనీల ‘మందు’పాతర.. ఏప్రిల్ 1న విడుదల
విచారణ సమయంలో రాహుల్ రమేష్ షెవాలే తరపు న్యాయవాది మాట్లాడుతూ సంజయ్ రౌత్ తదితరులు భారత ఎన్నికల సంఘం వంటి సంస్థపై ఆరోపణ చేశారని అన్నారు. ఇలాంటి ఆరోపణలపై స్పందించే అవకాశం ఈసీఐకి ఉందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం శివసేన గుర్తు ‘విల్లు-బాణం’ని ఏక్ నాథ్ షిండే వర్గానికి అప్పగించింది.
గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమి పోటీ చేసింది. ఈ కూటమికి మ్యాజిక్ ఫిగర్ కు అవసరం అయిన స్థానాలు వచ్చాయి. అయితే తమకే సీఎం పదవి కావాలని శివసేన డిమాండ్ చేసింది. చివరకు బీజేపీని వదిలి ప్రత్యర్థులు అయిన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలో మహావికాస్ అఘాడీ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై గతేడాది శివసేనలోని ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు చేశారు. 40కి పైగా ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలపడంతో ఏక్ నాథ్ సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి ‘టాయ్ స్టోరీ’ 5 వరకు..
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
Meerpet Aya Murder: రూ.10 వేల కోసం ఘోరం.. మీర్పేట్ ఆయా హత్యలో షాకింగ్ ట్విస్ట్.!
-
CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
-
Hema Slams Anasuya: ‘జై శ్రీరామ్’ ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు… అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
ట్రెండింగ్
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!