PM Modi: ప్రధాని మోడీకి అభినందనలు చెప్పని ఆ రెండు దేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: 2024 ఎన్నికల్లో మెజారిటీ సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి రాబోతోంది. ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి బాధ్యతలు తీసుకోబోతున్నారు. మొత్తం 543 ఎంపీ సీట్లు ఉన్న పార్లమెంట్ దిగువసభలో మ్యాజిక్ ఫిగర్(272)ని దాటి ఎన్డీయే కూటమి 293 స్థానాలను సాధించింది. గత రెండు పర్యాయాలతో పోలిస్తే బీజేపీ సీట్లు తగ్గినప్పటికీ, కూటమిగా అధికారాన్ని చేపట్టబోతోంది. బీజేపీకి ఈ ఎన్నికల్లో 240 సీట్లు వచ్చాయి. మెజారిటీ మార్కు కన్నా దాదాపుగా 30 సీట్లు తగ్గాయి. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటూ మోడీ చరిత్ర సృష్టిస్తున్నారు.
బీజేపీ, ఎన్డీయే కూటమి, ప్రధాని మోడీ విజయం పట్ల ప్రపంచ దేశాధినేతలు తమ అభినందనలు తెలియజేస్తున్నారు. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, శ్రీలంక, దక్షిణకొరియా, తైవాన్, యూరోపియన్ యూనియన్ ఇలా అన్ని దేశాలు శుభాకాంక్షలు తెలిపాయి. కాస్త ఆలస్యమైనా కెనడా, ఉక్రెయిన్ దేశాధినేతలు కూడా ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేశారు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: Ukraine: మోడీకి కంగ్రాట్ చెప్పిన జెలెన్ స్కీ.. ఉక్రెయిన్కు ఆహ్వానం
ఇదిలా ఉంటే రెండు దేశాలు మాత్రమే మరోసారి అధికారం చేపట్టబోతున్న నరేంద్రమోడీకి రెండు దేశాలు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అభినందనలు తెలియజేయలేదు. పాకిస్తాన్, టర్కీలు ఇప్పటికీ ఎలాంటి సందేశాన్ని పంపించలేదు. ఇటీవల పాకిస్తాన్ ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న షెహబాజ్ షరీఫ్కి ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పారు. అయితే, మోడీ మరోసారి గెలిచి భారత ప్రధాని అవ్వడం పాకిస్తాన్కి ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. మరోవైపు కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కి వంతపాడే టర్కీ దేశం కూడా మోడీకి ఎలాంటి సందేశాన్ని పంపలేదు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాకిస్తాన్ పలు ఫేక్ హ్యాండిల్స్ ద్వారా మోడీ వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించాయి. ఏకంగా పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి వంటి వారు కాంగ్రెస్, ఆప్, రాహుల్ గాంధీకి బహిరంగంగా మద్దతు పలుకుతూ ట్వీట్స్ చేశారు. పాకిస్తాన్లోని ప్రజలు నరేంద్రమోడీ గెలుపును కోరుకోవడం లేదని, ఓడిపోవాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. మరోవైపు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా భారత వ్యతిరేక, మోడీ వ్యతిరేకతను పలు సందర్భాల్లో ప్రదర్శించారు. అంతర్జాతీయ వేదికల్లో పాక్కి మద్దతుగా కాశ్మీర్ సమస్యను లేవనెత్తాడు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!